Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెలుపు తథ్యం... 110 నుంచి 140 సీట్లు మావే... : చంద్రబాబు

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (14:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తంచేశారు. ఆయన సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో గెలుపు ద్వారా టీడీపీ చరిత్ర సృష్టించబోతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 110 నుంచి 140 సీట్ల వరకూ టీడీపీ దక్కించుకుంటుందన్న అభిప్రాయం సర్వత్రా ఉందన్నారు. రాష్ట్రంలో టీడీపీ గెలుపు వెయ్యి శాతం విజయం తథ్యమన్నారు. 
 
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పార్టీ పోరాటం చేస్తోందన్నారు. వైసీపీ అరాచకాలను, బీజేపీ తప్పుడు పనులను ప్రజల్లో ఎండగట్టామని వ్యాఖ్యానించారు. ఎన్నికల వేళ టీడీపీపై ప్రతీరోజూ దాడులు జరిగాయనీ, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. ఏపీలో దాదాపు 8 లక్షల ఓట్లను తొలగించేందుకు కుట్రలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఢిల్లీలో 30 లక్షల ఓట్లను తొలగించారన్నారు. ఫామ్ 7తో  ఏపీలోనూ భారీ సంఖ్యలో ఓట్లను తొలగించాలని కుట్ర పన్నారనీ కానీ తాము ఆరంభంలోనే మేల్కొనడంతో ఏం చేయలేక పోయారన్నారు. 
 
ఇకపోతే, తొలి దశ పోలింగ్ రోజున రాష్ట్రంలో ఏర్పాటు చేసిన అనేక పోలింగ్ కేంద్రాల్లో అమర్చిన ఈవీఎంలు మొరాయించాయనీ ఈ కారణంగా చాలా మంది ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారన్నారు. ఇలాంటివారిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ కూడా ఉన్నారన్నారు.  ఆ తర్వాత తన పిలుపుతో మళ్లీ వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. అసలు 50 శాతం వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను లెక్కించడానికి ఈసీకి ఉన్న అభ్యంతరం ఏంటని టీడీపీ అధినేత చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments