Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపాసన చిన్నాన్నకు మద్దతుగా చిరంజీవి ప్రచారం...

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (12:29 IST)
మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అదీకూడా జనసేన పార్టీ తరపున కాదు సుమా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర రెడ్డి తరపున ఆయన ప్రచారం చేయనున్నారు. కొండా విశ్వేశ్వర రెడ్డి తన కోడలు ఉపాసనకు స్వయానా చిన్నాన్న. అందుకే ఆయన తరపున ప్రచారం చేయాలని చిరంజీవి భావిస్తున్నారు. 
 
తెలంగాణలోని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తరపును ప్రచారాన్ని నిర్వహించాలని చిరు నిర్ణయించారని, ఈ విషయాన్ని తాండూరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి వెల్లడించారు. మరోవైపు, మంగళవారం చిరంజీవిని కొండా విశ్వేశ్వర రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిమధ్య ఎన్నికల ప్రచార ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన ఈనెల 8వ తేదీన ప్రచారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడుగా, కేంద్ర మాజీ మంత్రిగా పని చేసిన విషయం తెల్సిందే.,

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments