Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫైనల్ పంచ్ వేసిన చంద్రబాబు... జగన్ పైన దిమ్మతిరిగే ఆరోపణ... నిజమేనా?

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (18:27 IST)
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చివరి రోడ్‌షో తాడికొండలో జరిగింది. రాజధాని అమరావతి గురించి జగన్ కనీసం ప్రచారంలో చివరిరోజైనా ఒక్క మాట కూడా మాట్లాడలేదని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు. రాజధానిగా అమరావతి ఉండడం జగన్‌కు ఇష్టంలేదని, గెలిస్తే రాజధానిని మార్చేస్తానంటున్నారని మండిపడ్డారు. అమరావతిలో చాలామంది రైతులు స్వచ్ఛందంగా భూములిస్తే ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ అర్థంలేని విమర్శలు చేస్తున్నారని, ఇది జగన్ మూర్ఖత్వానికి నిదర్శనం అన్నారు.
 
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు కేసీఆర్‌ నిన్న మద్దతు ప్రకటించడంపై చంద్రబాబు స్పందిస్తూ, తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదాపై వ్యతిరేకంగా మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు ఏ ఉద్దేశంతో ఈ ప్రకటన చేసారో ప్రజలకు తెలుసని చెప్పారు. పోలవరాన్ని ఆపివేయాలని కేసీఆర్ సుప్రీంకోర్టులో కేసులేశారని బాబు విమర్శించారు. తెలంగాణలో తాను ప్రచారం చేస్తే మీకేం పని ప్రశ్నించిన కేసీఆర్‌కు ఏపీలో ఇప్పుడేం పని అని నిలదీశారు.
 
కేసీఆర్‌, జగన్‌ మధ్య 1000 కోట్ల రూపాయల ఒప్పందం కుదిరిందని బాబు ఆరోపించారు. 1000 కోట్ల రూపాయలు తీసుకుని జగన్‌ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టబోతున్నారని విమర్శించారు. తాను అధికారంలో ఉంటే వచ్చే ఐదేళ్లలో అమరావతి అద్భుతంగా రూపుదిద్దుకుంటుందని, దీని వల్ల హైదరాబాద్ గ్రాఫ్‌ పడిపోతుందని భయపడుతున్నారని, అటువంటివారికి జగన్‌ సహకరిస్తున్నారని అన్నారు. 'ఈ ఐదేళ్లూ ఎవరికీ ఇబ్బంది లేకుండా పాలన సాగించాను. ఈ ఎన్నికల ప్రచారంలో ఇదే నా చివరి సభ. మీ ఆశీస్సులు కావాలి' అని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments