Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓట్లు 299.. పోలైన ఓట్లు 350.. ఏపీ ఎన్నికల్లో ఇలాంటి వింతలెన్నో...

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (09:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన పోలింగ్‌లో తప్పులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే ఉన్న ఓట్ల కంటే పోలింగైన ఓట్లు ఎక్కువగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. దీనిపై సిబ్బందిని అడిగితే వారు అనేక కారణాలను చెబుతున్నారు. 
 
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓట్ల కంటే ఎక్కువ పోలింగ్ జరిగినట్లు చూపడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక్కడ 5 పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం పోలింగ్ నమోదైనట్లుగా చెబుతున్నారు. సంతమాగులూరు మండలం 48వ పోలింగ్ కేంద్రంలో 299 మహిళా ఓటర్లు ఉండగా 350 ఓట్లు పోలైనట్లు చూపించటం విశేషం. 
 
అద్దంకి పట్టణంలోని 154వ పోలింగ్ కేంద్రంలో 435 మంది పురుష ఓటర్లు ఉండగా 500 ఓట్లు పోలైనట్లు చూపించారు. మొత్తం పోలింగ్ శాతం 89.87గా చూపించినా లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే ఇలాంటి విషయాలు బయటపడుతున్నాయి. ఎందుకిలా జరిగిందని ప్రశ్నిస్తే, అధికారుల నుంచి వస్తున్న సమాధానం వింటే మతిపోవాల్సిందే. 
 
ఎన్నికల రోజున హడావుడిగా ఉండటంతో కంప్యూటర్లో తప్పుగా నమోదైందని చెప్పటం విశేషం. ఎంట్రీలో మాత్రమే పొరపాటు జరిగిందని, దాన్ని సరిచేసి పంపుతామని చెబుతున్నారు. వీరి తీరు చూస్తుంటే పోలింగ్ జరిగిన విధానంపైనా అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments