Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్.. ఆకాశంలో ప్రైవేట్ బస్సు టిక్కెట్ ధరలు

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (17:22 IST)
'దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి' అనే సూత్రాన్ని ట్రావెల్ సంస్థలు ఇప్పుడు తూచాతప్పకుండా పాటిస్తున్నాయి. వారి స్వప్రయోజనం కోసం సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఎన్నికల నేపథ్యాన్ని ఆసరాగా చేసుకుని టిక్కెట్ రేట్లను అమాంతంగా పెంచేశారు. ఓటు వేయడానికి ఇతర ప్రదేశాల నుంచి స్వస్థలానికి వెళ్లే ప్రయాణీకుల నుండి డబ్బులు దండుకుంటున్నారు.
 
ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఓటేయడానికి వెళ్తున్న వారి జేబులను ప్రైవేట్ బస్సుల వాళ్లు ఖాళీ చేస్తున్నారు. సాధారణంగా రూ.500 ఉండే టిక్కెట్ ధరను రూ.1000కి పెంచేశారు. కొన్ని బస్సులలో అయితే రూ.1200 నుంచి రూ.1500 వరకు పెంచేశారు. 
 
బుకింగ్‌ల సంఖ్య పెరిగేకొద్దీ రేటు కూడా పెరుగుతోంది. దానికి తోడు డిమాండ్ అధికంకావడంతో ధరకు అడ్డుకట్ట వేసేవారు లేకపోయారు. ఈ విషయంలో ఎన్నికల కమీషన్ జోక్యం చేసుకోవాలి. ఓటు వేయడం మీ బాధ్యత అని ఈసీ గట్టిగా చెబుతూ ఉంటుంది. ఆ బాధ్యను నెరవేర్చడానికి వందల కిలోమీటర్ల ప్రయాణించే వారికి చాలా ఇబ్బంది కలుగుతోంది. మంగళ, బుధవారాల్లో భారీ సంఖ్యలో ప్రయాణీకులు ఉంటారు. ఈసీ చొరవ చూపి దీనిపై చర్య తీసుకుని టిక్కెట్ రేటు న్యాయబద్ధంగా ఉండేలా చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments