Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు డమ్మీ ఈవీఎంలు : వైకాపా సరికొత్త ఎత్తులు?

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (17:27 IST)
వెస్ట్ గోదావరి జిల్లాలో డమ్మీ ఈవీఎంలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు రహస్యంగా తరలిస్తుండగా జిల్లాలోని కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో ఇవి బయటపడ్డాయి. దాదాపు 350కు పైగా ఈవీఎంలను ఓ మినీ వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీటిని జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయానికి తరలించారు. 
 
మరోవైపు, మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైకాపా సరికొత్త ప్రచారానికి తెరదీసింది. ఓటర్లకు అవగాహనా కల్పించే ప్రచారంలో భాగంగ, నమూనా (డమ్మీ) ఈవీఎం బ్యాలెట్ పత్రాన్ని ముద్రించింది. ఇందులో తమకు ఎన్నికల సంఘం కేటాయించిన సంఖ్య 4ను సక్రమంగానే ముద్రించింది. కానీ, టీడీపీకి ఈసీ రెండో నంబరును ముద్రించగా, దాన్ని మూడో నంబరుగా ముద్రించి ఓటర్లను గందరగోళానికి గురిచేసే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దీనిపై టీడీపీ నేత బుట్టా సుధాకర్ యాదవ్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. 
 
కాగా, వైఎస్. జగన్మోహన్ రెడ్డి తాజాగా రాజకీయ పరిస్థితులు, ప్రచారంపై రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నివాసంలో పార్టీ నేతలతో మంతనాలు జరిపారు. ఆ తర్వాత బుధవారం నుంచి ఆయన గుంటూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో డమ్మీ ఈవీఎంలు హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు తరలించడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments