Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు డమ్మీ ఈవీఎంలు : వైకాపా సరికొత్త ఎత్తులు?

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (17:27 IST)
వెస్ట్ గోదావరి జిల్లాలో డమ్మీ ఈవీఎంలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు రహస్యంగా తరలిస్తుండగా జిల్లాలోని కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో ఇవి బయటపడ్డాయి. దాదాపు 350కు పైగా ఈవీఎంలను ఓ మినీ వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీటిని జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయానికి తరలించారు. 
 
మరోవైపు, మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైకాపా సరికొత్త ప్రచారానికి తెరదీసింది. ఓటర్లకు అవగాహనా కల్పించే ప్రచారంలో భాగంగ, నమూనా (డమ్మీ) ఈవీఎం బ్యాలెట్ పత్రాన్ని ముద్రించింది. ఇందులో తమకు ఎన్నికల సంఘం కేటాయించిన సంఖ్య 4ను సక్రమంగానే ముద్రించింది. కానీ, టీడీపీకి ఈసీ రెండో నంబరును ముద్రించగా, దాన్ని మూడో నంబరుగా ముద్రించి ఓటర్లను గందరగోళానికి గురిచేసే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దీనిపై టీడీపీ నేత బుట్టా సుధాకర్ యాదవ్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. 
 
కాగా, వైఎస్. జగన్మోహన్ రెడ్డి తాజాగా రాజకీయ పరిస్థితులు, ప్రచారంపై రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నివాసంలో పార్టీ నేతలతో మంతనాలు జరిపారు. ఆ తర్వాత బుధవారం నుంచి ఆయన గుంటూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో డమ్మీ ఈవీఎంలు హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు తరలించడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments