Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పు నీటిలో దూదిని ముంచి కళ్ళకు మర్దన చేసుకుంటే?

ఉప్పు కలిపిన నీళ్ళను యాంటీ సెప్టిక్‌గా ఉపయోగించవచ్చును. ఇంట్లో మరో యాంటీ సెప్టిక్ ఏది లేకపోయినా రసికారే పుండ్లను ఉప్పునీటితో కడగవచ్చును. బ్యాండేజ్ గానీ, బట్టగానీ పుండుకు అంటుకుపోతే కూడా గోరువెచ్చని ఉప్పు నీటితో కడిగితే శుభ్రమవుతాయి. విషాహారాన్ని తిన్

Webdunia
గురువారం, 16 ఆగస్టు 2018 (13:01 IST)
ఉప్పు కలిపిన నీళ్ళను యాంటీ సెప్టిక్‌గా ఉపయోగించవచ్చును. ఇంట్లో మరో యాంటీ సెప్టిక్ ఏది లేకపోయినా రసికారే పుండ్లను ఉప్పునీటితో కడగవచ్చును. బ్యాండేజ్ గానీ, బట్టగానీ పుండుకు అంటుకుపోతే కూడా గోరువెచ్చని ఉప్పు నీటితో కడిగితే శుభ్రమవుతాయి. విషాహారాన్ని తిన్నప్పుడు గ్లాస్ నీటిలో ఉప్పును కలుపుకుని తీసుకుంటే అది విరుగుడుగా పనిచేస్తుంది.
 
అధిక రక్తపోటుగల వారు, హృద్రోగులు, కాళ్ళ వాపు, మూత్రపిండాల వ్యాధులేవైనా ఉన్నవారు ఉప్పును ఆహారంలో జాగ్రత్తగా తీసుకోవాలి. తాపంగా ఉన్న అవయవాలకు, కీళ్ళ నొప్పులకు ఉప్పు నీటి కాపడం చాలా ఉపయోగపడుతుంది. చాలా మందికి అప్పుడప్పుడు గొంతు పట్టుకుంటుంది. అలాంటప్పుడు చిటికెడు ఉప్పును నాలుకపై వేసుకుని చప్పరిస్తే గొంతు సాఫీగా ఉంటుంది.
 
చెడుశ్వాస, చిగుళ్ళ వాపు వంటి సమస్యలు ఉన్నవారు ఉప్పునీటిని పుక్కిలిస్తే చాలా మంచిది. కళ్ళకు ఎక్కువగా పుసులు కడుతుంటే గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పును కలుపుకుని ఆ నీటిలో దూదిని ముంచి దానితో కళ్ళను శుభ్రం చేసుకోవచ్చును.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments