Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో.. అమ్మాయిలకు తల్లులే శత్రువులట?!

Webdunia
శనివారం, 6 సెప్టెంబరు 2014 (19:09 IST)
భారత్‌లో తల్లీకూతుళ్ళ మధ్య సంబంధాలపై యునిసెఫ్ ఓ అధ్యయనం చేపట్టింది. దాంట్లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అమ్మాయిలకు వారి తల్లులు, సవతి తల్లులే ప్రథమ శత్రువులని నివేదికలో తేలింది.
 
కూతుళ్ళను వారే ఎక్కువగా శారీరకంగా హింసిస్తారట. 15 నుంచి 19 ఏళ్ళ మధ్య వయసు ఉన్నవారిని పరిశీలించగా... 41 శాతం మంది అమ్మాయిలు వారి తల్లులు, సవతి తల్లుల చేతిలోనే అధికంగా భౌతిక హింసకు గురవుతున్నారని తెలిసింది. 
 
18 శాతం మంది బాలికలు వారి తండ్రులు, సవతి తండ్రుల చేతిలో దండనకు గురవుతున్నారట. క్రమశిక్షణ పేరిట ఈ హింస కొనసాగుతోందని యునిసెఫ్ పేర్కొంది. 
 
కాగా, 25 శాతం మంది అమ్మాయిలు వారి సోదరులు, సోదరీమణుల చేతిలో దెబ్బలు తింటున్నారని కూడా ఈ అధ్యయనం ద్వారా వెల్లడైంది. ఇక, వివాహితుల విషయానికొస్తే, 33 శాతం మంది భర్తల చేతిలో హింసకు గురువుతున్నారని, ఒక్క శాతం మంది మాత్రమే అత్తల చేతిలో దెబ్బలు తింటున్నారని నివేదిక చెబుతోంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం