Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో మహిళలే బెస్ట్.. వారితోనే లాభాల పంట!

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2015 (12:11 IST)
మహిళా నాయకత్వంలోనే లాభాల పంట సాధ్యమవుతుందని క్రెడిట్ స్విస్ నివేదిక వెల్లడించింది. కంపెనీల నిర్వహణలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తే లాభాల పంట పండిస్తారని.. పోటీ కంపెనీలతో తమ కంపెనీని లాభాల్లో ముందుకు తీసుకొస్తారని క్రెడిట్ స్విస్ అధ్యయన నివేదిక చెబుతోంది. 
 
కంపెనీలకు చెందిన బోర్డుల్లో మహిళలకు పెద్దపీట వేయడం ద్వారా వాటాదారులకు ఎక్కువ డివిడెండ్లు ఇవ్వడానికి, అధిక రాబడులను నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని క్రెడిట్ స్విస్ అనే సంస్థ పేర్కొంది. మహిళలు ఆర్థిక విషయాల్లో పాత సంప్రదాయ ధోరణులనే అనుసరిస్తారన్న దానికి ఎలాంటి ఆధారాలు లేవని, నూతన ఒరవడితో మహిళలు ముందడుగు వేస్తున్నారని పేర్కొంది. 
 
3వేల కంపెనీల్లోని 28వేల మంది సీనియర్ మేనేజర్ల అభిప్రాయాలను తీసుకుని క్రెడిట్ స్విస్ ఈ నివేదికను రూపొందించింది. ఈ కంపెనీల్లో భారత్‌లోని కంపెనీలు కూడా ఉన్నాయి. కొత్తగా ఆవిర్భవిస్తున్న కంపెనీల్లో మహిళల ప్రాతినిధ్యం బాగానే పెరుగుతోందని ఆ నివేదిక తెలిపింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments