Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముడతల చర్మాన్ని తొలగించాలంటే.. ఇలా చేయాలి..?

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (13:00 IST)
నిద్రలేమి, మానసిక ఒత్తిడి కారణంగా కొంతమందికి కళ్ల చివర్లు, పెదవుల చుట్టూ ముడతలు వస్తుంటాయి. చర్మంపై సన్నటి గీతల్లా కనిపించే ఈ ముడతలను మాయం చేసే సులువైన ప్యాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
 
ముందుగా.. తేనెకు గుడ్డు తెల్లసొన, నాలుగు చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ మాదిరిగా వేసుకోవాలి. బాగా ఆరిన తరువాత చల్లటి పాలలో ముంచిన దూదితో తొలగించి, చల్లటి నీటితో కడుక్కుని నాణ్యమైన మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి. ఇలా క్రమంతప్పకుండా చేసినట్లయితే ముఖంపై ముడతలు మటుమాయమవుతాయి.
 
అలాగే... శెనగపిండి, వరిపిండి చెరో చెంచా చొప్పున తీసుకుని దానికి కొద్దిగా పాలు, ఆలివ్ లేదా ఏదైనా వంటనూనె నాలుగైదు చుక్కలు కలిపి బాగా మెత్తటి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి.. ఆరిన తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. చర్మం కొత్త నిగారింపును సంతరించుకునే ఈ స్క్రబ్ పొడి చర్మం కలిగినవారికి ఎంతగానో మేలు చేస్తుంది.

సంబంధిత వార్తలు

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

తర్వాతి కథనం
Show comments