Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధూమపానంలో భారత్‌కు ద్వితీయ స్థానం : 1.27 కోట్ల మంది మహిళలు!

Webdunia
మంగళవారం, 28 అక్టోబరు 2014 (16:52 IST)
భారత్‌లో ధూమపానం చేసే మహిళల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ప్రస్తుతం ఏకంగా 1.27 కోట్ల మంది పొగతాగుతున్నట్టు ఓ అంతర్జాతీయ సంస్థ  నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. వాస్తవానికి జనాభా లెక్కల్లో కమ్యూనిస్టు దేశం చైనాను వెనక్కి నెట్టిన భారతీయ మహిళలు.. ధూమపానంలో అగ్రదేశాలతో సైతం పోటీ పడుతున్నారు. పొగతాగడంలో అమెరికాను మించిపోయి ద్వితీయ స్థానంలో నిలిచారు. గత మూడు దశాబ్దాల్లో మన దేశంలోని మహిళలల్లో ధూమపానం రెండింతలు పెరిగిందని ఓ అంతర్జాతీయ సంస్థ వెల్లడించింది. 
 
ప్రస్తుతానికి 1.27 కోట్ల మంది మహిళలు ధూమపానం చేస్తున్నారని తెలిపింది. ధూమపాన నివారణ చర్యలతో ఫ్రాన్స్, రష్యా దేశాలు మహిళల్లో ఆ అలవాటును మాన్పించగలిగాయని ఆ సంస్థ వివరించింది. ధూమపానం కారణంగా ప్రతి ఏటా సుమారు 10 లక్షల మంది మృతి చెందుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
 
మరోవైపు.. ధూమపానం ఆరోగ్యానికి హానికరమంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాలుగా ప్రచారం చేస్తున్నా.... ధూమపానం ఆగడం లేదు సరికదా, రోజురోజుకీ పెరిగిపోతోంది. దీని తీవ్రత గమనించిన కేంద్రం సిగరెట్, బీడీ పెట్టెలపై పుర్రెబొమ్మ ముద్రించడం వంటి హెచ్చరికలు అమలయ్యేలా నిబంధనలు తెచ్చింది. దానితో ఊరుకోకుండా అమాంతం ధరలు పెంచేసి, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం శిక్షార్హమని కూడా ప్రకటించింది. అయినప్పటికీ, ధూమపానంలో భారతీయ మహిళలు అగ్రదేశాలతో పోటీ పడుతుండటం గమనార్హం. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments