Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయక చవితి పూజకు ఏ విగ్రహం మంచిది?

Webdunia
శనివారం, 31 ఆగస్టు 2019 (11:13 IST)
భౌతిక బలం కంటే బుద్ధిబలం గొప్పదని చాటి చెప్పిన విజ్ఞుడు విఘ్నేశ్వరుడు. పట్టుదల, బుద్ధిబలం వంటివి గణనాథునిలో ఉండటంతోనే గణాధిపతి అయ్యాడని పురోహితులు అంటున్నారు. 
 
పధ్నాలుగు లోకాల్లోని యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వ, సురాసురులు, మానవాది సమస్త జీవులతో పాటు త్రిమూర్తులచేత, ముగ్గురమ్మలచేత పూజలందుకునే వినాయకమూర్తిని పూజించేందుకు ఏ విగ్రహము శ్రేష్టమైందో తెలుసా? గురువులకు గురువైన గణేశుడిని రాగి విగ్రహ రూపంలో పూజిస్తే ఐశ్వర్యం లభిస్తుందని పురోహితులు చెబుతున్నారు.
 
అలాగే వెండివినాయకుడిని పూజిస్తే ఆయుర్‌వృద్ధి కలుగుతుందని, బంగారు విగ్రహ రూపంలో గణపతిని పూజిస్తే సంకల్పం సిద్ధిస్తుందని విశ్వాసం.
 
అలాగే మట్టితో చేసిన విగ్రహానికి నవరాత్రులు పూజలు చేసి నీటిలో నిమజ్జనం చేస్తే.. వరసిద్ధి, ఆయువు, ఐశ్వర్యం, జ్ఞానసిద్ధి, సంకల్పసిద్ధి, ధన, కనక, వస్తు, వాహనాలు, ఐహికపర సుఖాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. 
 
ఇకపోతే.. ప్రతిరోజూ పూజలో గణపతిని పసుపు ముద్దతో చేసి పూజించడం ద్వారా అన్ని విఘ్నాలు తొలగిపోయి, ప్రశాంత జీవనం లభిస్తుంది. ఇంకేముంది..? మనం కూడా వినాయక చతుర్థినాడు గణపతిని నిష్టతో ప్రార్థించి.. స్వామివారి అనుగ్రహం పొందుదాం..!

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments