Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయక చవితి పూజకు ఏ విగ్రహం మంచిది?

Webdunia
శనివారం, 31 ఆగస్టు 2019 (11:13 IST)
భౌతిక బలం కంటే బుద్ధిబలం గొప్పదని చాటి చెప్పిన విజ్ఞుడు విఘ్నేశ్వరుడు. పట్టుదల, బుద్ధిబలం వంటివి గణనాథునిలో ఉండటంతోనే గణాధిపతి అయ్యాడని పురోహితులు అంటున్నారు. 
 
పధ్నాలుగు లోకాల్లోని యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వ, సురాసురులు, మానవాది సమస్త జీవులతో పాటు త్రిమూర్తులచేత, ముగ్గురమ్మలచేత పూజలందుకునే వినాయకమూర్తిని పూజించేందుకు ఏ విగ్రహము శ్రేష్టమైందో తెలుసా? గురువులకు గురువైన గణేశుడిని రాగి విగ్రహ రూపంలో పూజిస్తే ఐశ్వర్యం లభిస్తుందని పురోహితులు చెబుతున్నారు.
 
అలాగే వెండివినాయకుడిని పూజిస్తే ఆయుర్‌వృద్ధి కలుగుతుందని, బంగారు విగ్రహ రూపంలో గణపతిని పూజిస్తే సంకల్పం సిద్ధిస్తుందని విశ్వాసం.
 
అలాగే మట్టితో చేసిన విగ్రహానికి నవరాత్రులు పూజలు చేసి నీటిలో నిమజ్జనం చేస్తే.. వరసిద్ధి, ఆయువు, ఐశ్వర్యం, జ్ఞానసిద్ధి, సంకల్పసిద్ధి, ధన, కనక, వస్తు, వాహనాలు, ఐహికపర సుఖాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. 
 
ఇకపోతే.. ప్రతిరోజూ పూజలో గణపతిని పసుపు ముద్దతో చేసి పూజించడం ద్వారా అన్ని విఘ్నాలు తొలగిపోయి, ప్రశాంత జీవనం లభిస్తుంది. ఇంకేముంది..? మనం కూడా వినాయక చతుర్థినాడు గణపతిని నిష్టతో ప్రార్థించి.. స్వామివారి అనుగ్రహం పొందుదాం..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

లేటెస్ట్

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

తర్వాతి కథనం
Show comments