మినప పప్పుతో మిక్స్‌డ్ వెజిటబుల్ వడలు తయారీ ఎలా?

Webdunia
బుధవారం, 20 ఆగస్టు 2014 (15:01 IST)
కావలసిన పదార్థాలు :
మినప్పప్పు... రెండు కప్పులు
శెనగపప్పు... అర కప్పు
క్యారెట్ తురుము... అర కప్పు
క్యాబేజీ తురుము... అర కప్పు
అల్లం, పచ్చిమిరప పేస్ట్... 5 టీస్పూన్లు
పుదీనా, కరివేపాకు తరుగు... ఒక కప్పు
ఉప్పు... సరిపడా
ఉల్లిపాయ తరుగు... అర కప్పు
నూనె... వేయించేందుకు సరిపడా
 
తయారీ విధానం :
ముందుగా మినప పప్పు, శనగపప్పులను మూడు గంటలపాటు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత వాటిలో నీటిని ఒంపేసి కొంచెం పలుకుగా ఉండేటట్లు గ్రైండ్ చేయాలి. దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని అందులో.. ఉల్లిపాయ తరుగు, క్యారెట్ తురుము, క్యాబేజీ తురుము, అల్లం పచ్చిమిరప పేస్ట్, పుదీనా కరివేపాకు తరుగు, తగినంత ఉప్పువేసి బాగా కలుపుకోవాలి.
 
ఇప్పుడు బాణలిలో నూనెపోసి బాగా కాగిన తరువాత.. పై మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని వడల్లాగా వత్తి వేయాలి. రెండువైపులా బాగా ఎర్రగా కాలిన తరువాత తీసేయాలి. అంతే మినప్పప్పుతో మిక్స్‌డ్ వెజిటబుల్ వడలు రెడీ అయినట్లే...! వీటిని వేడిగా తిన్నా, చల్లారాక తిన్నా కూడా చాలా రుచికరంగా ఉంటాయి. ఇష్టమైనవాళ్లు ఈ వడలను ఎర్రకారం లేదా సాస్‌తో పాటు ఆరగించవచ్చు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి రావాలని జగన్ ఎందుకు కోరుకుంటున్నారు?

సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చు : ఏపీ సీఎం చంద్రబాబు

iBomma Ravi: ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ

వెనెజులా అధ్యక్షుడు మదురోను ఎలా నిర్భంధంచారో తెలుసా? (Video)

అసెంబ్లీ కౌరవ సభగా మారిపోయింది.. కేసీఆర్‌ను కాదు రాహుల్‌ను అలా చేయండి.. కేటీఆర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ - రెబల్ స్టార్ చిత్రాలకు ఊరట... 'రాజాసాబ్' టిక్కెట్ ధర రూ.1000

Sakshi Vaidya: నాకు పర్సనల్గా చాలా రిలేట్ అయిన పాత్ర చేశా : సాక్షి వైద్య

Raviteja: సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి తో సరదగా గోలగోల చేద్దాం : రవితేజ

ద్రౌప‌ది 2 నుంచి పీరియాడిక్ ట‌చ్‌తో సాగే తారాసుకి..సాంగ్ రిలీజ్

Aishwarya: ఐశ్వర్య అర్జున్ అందాలు హైలైట్ గా సీతా పయనం నుంచి సాంగ్ రిలీజ్

Show comments