ముందుగా అవిసె గింజలు, నువ్వులు, పల్లీలను విడివిడిగా మిక్సీలో పౌడర్లా చేసుకుని పక్కన బెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా సిద్దం చేసి ఉంచుకున్న సెనగల ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి ముద్ద, పసుపు, నిమ్మరసం, కొత్తిమీర, ఉప్పు వేసి అన్నీ కలిసేలా కలపాలి.
బెండకాయలను శుభ్రంగా కడిగి తడిపోయే వరకు ఆరబెట్టి, రెండు వైపులా తొడిమలు తీసి, మధ్యకు గాటు పెట్టాలి. తర్వాత స్టఫింగ్ మిశ్రమాన్ని బెండకాయలో స్టఫ్ చేసి.. వెడల్పాటి ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి కాగాక బెండకాయలను ఒక్కొక్కటిగా ఉంటి బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాలు ఉంచాలి.
స్టఫ్ బెండకాయ 10నిముషాలు ఉడికిన తర్వాత పల్లీ, నువ్వులు, అవిసె గింజల పొడుల మిశ్రమం వేసి కలిపి దించేయాలి. అంతే స్టఫ్డ్ బెండీ రెడీ. ఇది వేడి రైస్, చపాతీలకు చాలా టేస్ట్గా ఉంటుంది.