Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటికి ఆ దిశలో దిబ్బలు, రాళ్ల గుట్టలు వుంటే?

Webdunia
గురువారం, 27 ఫిబ్రవరి 2020 (21:15 IST)
ఈశాన్యదిశయందు దిబ్బలు, పేడకుప్పలు, రాళ్ళ గుట్టలు మొదలైనవి కల్గియున్నట్లైతే సుఖహీనత, నీచప్రవర్తన, విరోధములు, ఆయుక్షీణములు సంభవించి దరిద్రులు కాగలరు. ఈశాన్యము మెరక కల్గియున్నను, పల్లముగానున్నను అందుపాకలు, పందిళ్లు ఇతర కట్టడములు, బరువులు కల్గియున్న - దరిద్రము, కీడు, భార్యలేక గృహయజమానురాలికి తీవ్ర అనారోగ్యము, పుత్రనష్టము సంభవింపగలదు.
 
ఈశాన్యమునందు బావియుండుట ఐశ్వర్యప్రదము. వర్షపు నీరు, వాడుకనీరు పోవు కాల్వలు, గోతులు, జలాశయములు యుండుట వలన వంశవృద్ధి కల్గి, ధనదాన్య సంపదలు వృద్ధినందగలవు. ఈశాన్యంలో నీళ్ళకుండీలు భూమట్టమునకు తక్కువగా నిర్మించుకొనవచ్చును. వాటర్‌టాంక్‌లు నిర్మింపరాదు. మరుగుదొడ్లు నిర్మించిన యెడల కుటుంబకలహములు, నష్టములు, సంతతికి కీడు కలుగ గలదు.
 
ఈశాన్యదిశయందు స్థలము పెరిగి పల్లముగా నుండుట వలన సర్వశుభములు ప్రాప్తించగలవు. ఈశాన్యస్థలమునకు ఈశాన్య మందు ఇతరుల స్థలములు ఈ స్థలమునకన్న మించియున్న యెడల ధననాశనము, వంశహాని సంభవింపగలదు.
 
ముఖ్యముగా స్థలమందుగానీ, గృహమందుగానీ, గదులలో గానీ ఈశాన్యమూలన ఏ విధములైన కట్టడములు నిర్మించుట ద్వారములుండుట, బరువులుండుట మొదలైనవి శాస్త్ర విరుద్ధము. ఈశాన్యమందు ఖాళీగా వుంచుట శ్రేయస్కరము. ఈశాన్యదిశ పల్లము కల్గియుండు నట్లు గృహనిర్మాణ మొనర్చినట్లైతే అఖండ ఐశ్వర్యాలు చేకూరుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments