ఉత్తరం వైపు కూర్చొని భోజనం చేస్తే సర్వ అరిష్టాలే!!

Webdunia
గురువారం, 14 ఆగస్టు 2014 (19:15 IST)
మనిషి శక్తికి ముఖ్యమైనది ఆహారం. ఆ ఆహారంలో ఎన్నో రకాలున్నాయి. వివిధ రకాలుగా వివిధ రుచులతో ఇష్టమైన రీతిలో ఆహారాన్ని తయారు చేసుకుని కడుపారా ఆరగిస్తుంటాం. ఆ వంటకాలు ఎంతో శుభ్రంగానూ, రుచిగా.. ఆరోగ్యకరంగా కూడా ఉండాలని భావిస్తాం. 
 
అయితే ఈ ఆహారాన్ని ఏ వైపు కూర్చుని తినాలన్న విషయాన్ని ఆలోచించామా? పూర్వకాలంలో అయితే పీటలు వేసుకుని కూర్చుని భుజించేవాళ్లు. కానీ ఈ ఆధునిక కాలంలో డైనింగ్ టేబుళ్లు అవీ అంటూ ఏ దిశలో కూర్చుంటున్నామో కూడా తెలియడంలేదు. టేబుల్‌ను కూడా సరైన దిశలో అమర్చుకుని తింటే మనకు శుభాలు జరుగుతాయి.
 
తూర్పు ముఖం పెట్టి భుజించడం ద్వారా ఆయుష్షు పెరుగుతుంది. పడమర వైపు కూర్చుని భుజిస్తే ఇంట్లోని సామాను వృద్ధి చెందుతుందట. దక్షిణం వైపు కూర్చుని భుజిస్తే పేరు ప్రతిష్టలు వృద్ధి చెందుతాయట. అంతేకాదు, ఏ కార్యము తలపెట్టినా విజయాలే కలుగుతాయట.
 
ఉత్తరం దిక్కు చూస్తూ కూర్చుని భుజించరాదు. ఆ వైపు ముఖం పెట్టి భుజిస్తే సర్వ అరిష్టాలతో పాటు అనారోగ్యాలు వెన్నంటే ఉంటాయట. టేబుల్‌పైన అయినా సరే, పీట వేసుకుని భుజించే సమయంలోనైనా సరే ఈ దిశలలో కూర్చోవడం ద్వారా సకల శుభాలూ కలుగుతాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బత్తాయిల్ని పిండుకుని తాగేశా, ఎవడూ నా ఈక కూడా పీకలేడు, రూ.8 కోట్లు కూర్చుని తింటా

సంక్రాంతి రద్దీ : విశాఖపట్నం నుండి 1,500 అదనపు బస్సు సర్వీసులు

వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలను తొలగిస్తే ఊరుకునేది లేదు.. కేటీఆర్

కేసీఆర్ ఆధునిక శుక్రాచార్యుడు.. కేటీఆర్ మారీచుడు.. సీఎం రేవంత్ రెడ్డి

సంక్రాంతి సంబరాలు.. కోనసీమలో బోట్ రేసు పోటీలు.. పాల్గొంటున్న 22 జట్లు

అన్నీ చూడండి

లేటెస్ట్

11-01-2026 నుంచి 17-01-2026 వరకు మీ వార రాశిఫలితాలు

10-01-2026 శనివారం ఫలితాలు : సంకల్పబలమే కార్యోన్ముఖులను చేస్తుంది...

Leopard: శ్రీవారి మెట్టు నడక మార్గంలో చిరుతపులి.. భక్తుల్లో భయం భయం

09-01-2026 శుక్రవారం ఫలితాలు - రుణ ఒత్తిడితో మనశ్శాంతి ఉండదు...

Srivani Darshan: ఉదయం బుక్ చేసుకుంటే సాయంత్రం శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు.. ఎలా?

Show comments