Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్జెట్ 2022-23కు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (11:03 IST)
2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థిక శాఖ తయారు చేసిన వార్షిక బడ్జెట్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలోని బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్‌ను విత్తమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఉదయం 11 గంటలకు వేశపెట్టనున్నారు. 
 
అయితే, ఈ దఫా కూడా నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రతులను ఎర్ర బ్యాగ్‌లోని ట్యాబ్‌లో బడ్జెట్‌ను తీసుకొచ్చారు. అనంతరం లోక్‌సభలో నిర్మలమ్మ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. కరోనా దృష్ట్యా ఈసారి కూడా బడ్జెట్ ప్రసంగం పేపర్‌లెస్‌గానే ఉంటుంది. 
 
ఇందుకోసం నిర్మలమ్మ సంప్రదాయ బహీ ఖాటాను వదిలి స్వదేశీ ట్యాబ్‌తో పార్లమెంట్‌కు వెళ్లారు. సభ్యులకు బడ్జెట్ సాఫ్ట్ కాపీలు ఇస్తారు. మరోవైపు బడ్జెట్‌కు సంబంధించిన ముద్రిత కాపీలను పరిమిత సంఖ్యలో పార్లమెంటుకు తీసుకొచ్చారు. వీటిని మీడియాతో సహా ఇతరులకు అందజేయనున్నారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments