Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్జెట్ 2021-22: వ్యక్తిగత వాహనాలకు కాలపరిమితి .. నిర్మలమ్మ

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (11:47 IST)
బడ్జెట్ 2021-22 సంవత్సర వార్షిక బడ్జెట్‌ను ఆరు మూలస్తంభాలను ఆధారంగా చేసుకుని తయారు చేయడం జరిగిందని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆమె సోమవారం లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బ‌డ్జెట్ 2021లో భాగంగా ఆరు మూల స్తంభాల‌ను ఆధారంగా చేసుకుని బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్టు తెలిపారు. 
 
ఇందులో మొదటిది ఆరోగ్యం, సంర‌క్ష‌ణ, రెండోది ఫిజిక‌ల్‌, ఫైనాన్షియ‌ల్ క్యాపిట‌ల్ అండ్ ఇన్‌ఫ్రా, మూడోది స‌మ్మిళిత వృద్ధి, నాలుగోది హ్యూమ‌న్ క్యాపిట‌ల్‌, ఐదోది ఇన్నోవేష‌న్ అండ్ రీసెర్చ్ & డెవ‌ల‌ప్‌మెంట్ (ఆర్ & డీ), ఆరోది క‌నిష్ఠ‌ ప్ర‌భుత్వం, గ‌రిష్ఠ పాల‌న అని, ఈ ఆరు మూల స్తంభాల‌పైనే బడ్జెట్‌ను రూపొందించిన‌ట్లు నిర్మ‌ల తెలిపారు. 
 
ఇకపోతే, ఘ‌న వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ కోసం స్వ‌చ్ఛ‌భార‌త్ అర్బ‌న్‌, ఐదేళ్ల‌లో స్వ‌చ్ఛ‌భార‌త్ అర్బ‌న్ కోసం రూ.1,41,670 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ముఖ్యంగా, దేశంలోని వాహ‌నాల ఫిట్‌నెస్ ప‌రీక్ష‌కు ప్ర‌త్యేక విధానాన్ని తీసుకొచ్చారు. వ్య‌క్తిగ‌త వాహ‌నాల‌కు 20 ఏండ్లు, వాణిజ్య వాహ‌నాల‌కు 15 ఏండ్లుగా కాలపరిమితి విధించారు. ఈ కాల‌ప‌రిమితి ముగిసిన త‌ర్వాత ఫిట్‌నెస్ ప‌రీక్ష‌కు వెళ్లాల‌న్న నిబంధన పెట్టారు 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments