నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు - విత్తమంత్రి చేతిలో ఆర్థిక సర్వే

Webdunia
శుక్రవారం, 31 జనవరి 2020 (09:43 IST)
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి ఒకటో తేదీన 2020-21 సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందులోభాగంగా, శుక్రవారం వార్షిక బడ్జెట్ సమావేశాలు ఆరంభంకానున్నాయి. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 
 
దేశంలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం శనివారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 45 బిల్లులను ఉభయసభల ముందుకు తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే గురువారం అఖిలపక్ష సమాశం ఏర్పాటు చేశారు. మరోవైపు రేపు ప్రతిపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. ఏప్రిల్ ౩వ తేదీ వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. 
 
కాగా, ఈ బడ్జెట్‌పై మధ్య తరగతి, వేతన జీవులతో పాటు.. కార్పొరేట్ రంగాల వారు భారీ ఆశలనే పెట్టుకున్నారు. ప్రధానంగా గతేడాది కేంద్రం కార్పొరేట్‌ పన్ను తగ్గించడంతో వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపుదారులకూ ఊరట కల్పించాలన్న డిమాండ్‌ వ్యక్తమవుతోంది. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచడంతోపాటు సెక్షన్‌ 80సీ పరిమితినీ పెంచాలని కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments