Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి గౌరవ వేతనం రూ.5లక్షలు.. ఐదేళ్లకు ఓసారి పెంచాల్సిందే..

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎంపీల వేతనాలు పెరుగుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల వేతనాలు పెంచినట్లు అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రపతి

Webdunia
గురువారం, 1 ఫిబ్రవరి 2018 (12:43 IST)
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎంపీల వేతనాలు పెరుగుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల వేతనాలు పెంచినట్లు అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రపతి గౌరవ వేతనం రూ.5లక్షలకు, ఉపరాష్ట్రపతి గౌరవ వేతనం రూ.4లక్షలు, గవర్నర్ల గౌరవ వేతనం రూ.3.5లక్షలుగా పెంచనున్నట్లు తెలిపారు. ఐదేళ్లకు ఓసారి వేతనాలను పెంచే దిశగా చట్టం తేనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. 
 
అలాగే ప్రతి వ్యాపార సంస్థకు యూనిక్‌ ఐడీ వుంటుందని.. స్టాంప్‌ డ్యూటీల విధానం నుంచి బయట పడేందుకు రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతామని అరుణ్ జైట్లీ ప్రకటించారు. భారత్‌ నెట్‌వర్క్‌ కార్యక్రమం కోసం రూ.10వేల కోట్లు కేటాయించామని, గ్రామాల్లో 5లక్షల వైఫై రూటర్ల సదుపాయం కల్పిస్తామని జైట్లీ తెలిపారు. 
 
టోల్‌ ప్లాజాలో సులభతర ప్రయాణానికి వీలుగా ఎలక్ట్రానిక్‌ చెల్లింపులు వుంటాయని, 3600 కి.మీ. మేర రైల్వేలైన్ల పునరుద్ధరణ. 600 రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేస్తామని ప్రకటన చేశారు. అన్ని రైల్వే జోన్‌లు, రైళ్లలో సీసీటీవీలు, వైఫై సౌకర్యం ఏర్పాటు చేస్తామని చె్పపారు. చెన్నై పెరంబూర్‌లో అధునాతన కోచ్‌ల నిర్మాణం చేపట్టనున్నట్టు వెల్లడించారు. 
 
రైల్వేల్లో 18 వేల కి.మీ. డబ్లింగ్‌. రైలు పట్టాల నిర్వహణకు పెద్ద పీట వేస్తామని తెలిపారు. 4వేలకు పైగా కాపలాదారులు లేని గేట్లను తొలగిస్తామని ప్రకటించారు. ఇంటింటి తాగునీటి పథకానికి రూ.77,500కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నమామి గంగ పథకం కింద 187 ప్రాజెక్టులు, కొత్త ఉద్యోగాలు కల్పించే రంగాల్లో ప్రభుత్వం చెల్లించే ఈపీఎఫ్‌ 8.33శాతం నుంచి 12శాతానికి పెంచినట్లు వెల్లడించారు.
 
పెంచిన ఈపీఎఫ్‌ మూడేళ్ల పాటు అమల్లో వుంటుందని.. గత మూడు సంవత్సరాల్లో ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. పీఎం జీవన్‌ బీమా యోజన ద్వారా రెండు కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని.. జన్‌ధన్‌ యోజనలో భాగంగా 60వేల కోట్ల బ్యాంకు ఖాతాలకు బీమా సౌకర్యం వర్తిస్తుందని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Idli Kottu Review: ధనుష్ ఇడ్లీ కొట్టుతో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడా... ఇడ్లీ కొట్టు రివ్యూ

Nayana tara: మన శంకర వర ప్రసాద్ గారు జీవితంలో శశిరేఖ ఎవరు...

పవన్ కళ్యాణ్ "ఓజీ" : 'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్' అంటున్న నేహాశెట్టి

Bigg Boss Telugu 9: జయం సుమన్ శెట్టికి పెరుగుతున్న మద్దతు..

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments