Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.లక్షల కోట్లు పెట్టినా అమరావతిని అభివృద్ధి చేయలేం... అందుకే : సీఎం జగన్

Webdunia
శుక్రవారం, 27 డిశెంబరు 2019 (14:54 IST)
ఏపీ మంత్రివర్గ సమావేశం శుక్రవారం అమరావతిలో జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి రాజధాని తరలింపుపై తన మనసులోని మాటను మరోమారు స్పష్టం చేశారు. లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అమరావతిని అభివృద్ధి చేయలేమన్నారు. కానీ, ఆ రూ.లక్ష కోట్లలో పది శాతం నిధులు వెచ్చించినా విశాఖపట్టణంను మహానగరంగా అభివృద్ధి చేయగలమని వెల్లడించారు. దీంతో రాజధాని తరలింపు తథ్యమని తేలిపోయింది. 
 
రాజధాని అమరావతి అంశంపై గందరగోళం నెలకొనివున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో వెలగపూడిలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. రాజధాని తరలింపుపై మంత్రివర్గ సమావేశంలో అరగంటపాటు సీఎం జగన్ మంత్రులకు వివరించారు. ఎన్ని వేల కోట్లు పెట్టినా అమరావతిని అభివృద్ధి చేయలేమని వారికి చెప్పారు. 
 
రూ.లక్ష కోట్లలో పదిశాతం విశాఖలో ఖర్చుపెట్టినా హైదరాబాద్‌ స్థాయిలో రాజధాని అభివృద్ధి అవుతుందని సీఎం వివరించారు. రాజధాని మార్పు ఎందుకు, ఏమిటో ప్రజలకు చెప్పి చేద్దామని జగన్‌ మంత్రులతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. రాజధాని తరలింపుపై తొందరపాటు లేదని సీఎం జగన్‌ అభిప్రాయపడినట్లు సమాచారం. రూ.లక్ష కోట్లు పెట్టే ఆర్థిక స్థోమత ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని, అందులో పది శాతం విశాఖపై ఖర్చు పెట్టినా ప్రపంచ స్థాయిలో రాజధాని ఉంటుందన్నారు. 
 
మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తే.. రాజధాని మార్పు ఖాయమేనని స్పష్టమైంది. అయితే.. మార్చే ముందు కొత్త సరంజామా సిద్ధం చేస్తున్నారన్న విషయం తేటతెల్లమైంది. ఇన్నాళ్లూ తాము చేస్తున్న ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలపై మరింత ముందుకు వెళ్లేందుకు వైసీపీ సర్కార్ సన్నాహాలు మొదలుపెట్టింది. విచారణకు ఆదేశించే వ్యూహంపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. అలాగే రాజధాని తరలింపు అంశంపై న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments