Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.లక్షల కోట్లు పెట్టినా అమరావతిని అభివృద్ధి చేయలేం... అందుకే : సీఎం జగన్

Webdunia
శుక్రవారం, 27 డిశెంబరు 2019 (14:54 IST)
ఏపీ మంత్రివర్గ సమావేశం శుక్రవారం అమరావతిలో జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి రాజధాని తరలింపుపై తన మనసులోని మాటను మరోమారు స్పష్టం చేశారు. లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అమరావతిని అభివృద్ధి చేయలేమన్నారు. కానీ, ఆ రూ.లక్ష కోట్లలో పది శాతం నిధులు వెచ్చించినా విశాఖపట్టణంను మహానగరంగా అభివృద్ధి చేయగలమని వెల్లడించారు. దీంతో రాజధాని తరలింపు తథ్యమని తేలిపోయింది. 
 
రాజధాని అమరావతి అంశంపై గందరగోళం నెలకొనివున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో వెలగపూడిలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. రాజధాని తరలింపుపై మంత్రివర్గ సమావేశంలో అరగంటపాటు సీఎం జగన్ మంత్రులకు వివరించారు. ఎన్ని వేల కోట్లు పెట్టినా అమరావతిని అభివృద్ధి చేయలేమని వారికి చెప్పారు. 
 
రూ.లక్ష కోట్లలో పదిశాతం విశాఖలో ఖర్చుపెట్టినా హైదరాబాద్‌ స్థాయిలో రాజధాని అభివృద్ధి అవుతుందని సీఎం వివరించారు. రాజధాని మార్పు ఎందుకు, ఏమిటో ప్రజలకు చెప్పి చేద్దామని జగన్‌ మంత్రులతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. రాజధాని తరలింపుపై తొందరపాటు లేదని సీఎం జగన్‌ అభిప్రాయపడినట్లు సమాచారం. రూ.లక్ష కోట్లు పెట్టే ఆర్థిక స్థోమత ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని, అందులో పది శాతం విశాఖపై ఖర్చు పెట్టినా ప్రపంచ స్థాయిలో రాజధాని ఉంటుందన్నారు. 
 
మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తే.. రాజధాని మార్పు ఖాయమేనని స్పష్టమైంది. అయితే.. మార్చే ముందు కొత్త సరంజామా సిద్ధం చేస్తున్నారన్న విషయం తేటతెల్లమైంది. ఇన్నాళ్లూ తాము చేస్తున్న ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలపై మరింత ముందుకు వెళ్లేందుకు వైసీపీ సర్కార్ సన్నాహాలు మొదలుపెట్టింది. విచారణకు ఆదేశించే వ్యూహంపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. అలాగే రాజధాని తరలింపు అంశంపై న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments