మోడీ కాళ్ళను తాకి దండం పెట్టిన విజయసాయి... ఆశీర్వదించిన ప్రధాని

రాజ్యసభలో ఓ ఆసక్తికర దృశ్యం ఒకటి కనిపించింది. మంగళవారం ఉదయం రాజ్యసభ ప్రారంభమైన వెంటనే అన్నాడీఎంకే ఎంపీలు సభలో ఆందోళన చేశారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు.

Webdunia
మంగళవారం, 27 మార్చి 2018 (13:01 IST)
రాజ్యసభలో ఓ ఆసక్తికర దృశ్యం ఒకటి కనిపించింది. మంగళవారం ఉదయం రాజ్యసభ ప్రారంభమైన వెంటనే అన్నాడీఎంకే ఎంపీలు సభలో ఆందోళన చేశారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని ఛైర్మన్ వెంకయ్య నాయుడు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభకు వచ్చారు. ప్రధాని సభలో ఉన్నప్పటికీ అన్నాడీఎంకే సభ్యులు మాత్రం నినాదాలు చేశారు. 
 
ఇంతలో ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వచ్చి నమస్కారం చేయగా, దానికి ప్రధాని ప్రతినమస్కారం చేశారు. అనంతరం మోడీ కాళ్లకు వంగి దండం పెట్టారు. వంగి మోడీ కాళ్లను తాకారు. మోడీ ప్రతినమస్కారం చేస్తూ విజయసాయిరెడ్డి భుజంపై చేయివేసి ఆశీర్వదించారు. ఈ పరిణామం రాజ్యసభలో చోటుచేసుకుంది. 
 
మరోవైపు, ప్రధాని ఉన్నప్పటికీ అన్నాడీఎంకే ఎంపీలు తమ ఆందోళన కొనసాగించారు. దీంతో చైర్మన్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. కాగా ప్రధానితో సహా సభ్యులు ఎవరు బయటకు వెళ్లకుండా సభలోనే ఉండిపోయారు. ఈ సమయంలో ఎంపీ విజయసాయిరెడ్డి... ప్రధాని మోడీని కలిసి నమస్కారం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఈ షో విజేత ఎవరంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments