Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏనుగు విగ్రహం కాళ్ల మధ్య దూరిన మహిళ..అలా ఇరుక్కుపోయింది... వైరల్ వీడియో

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (16:39 IST)
ఫోటో కోసం ఫోజిచ్చింది. తర్వాతే ఆమెకు చుక్కలు కనిపించాయి. ఆలయానికి వెళ్ళామా.. దేవుడిని దర్శించామా అని లేకుండా.. ఓ చిన్నపాటి ఏనుగు బొమ్మ కాలి మధ్య దూరింది.


అంతే అదే ఆమెకు ఇబ్బందులకు గురిచేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇంకా పిచ్చపిచ్చగా కామెంట్లు చేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన ఓ మహిళ కొద్దిరోజుల క్రితం ఓ గుడికి వెళ్లింది. ఈ సందర్భంగా గుడిలో ఉన్న ఏనుగు బొమ్మతో ఫొటో దిగాలనుకుందామె. అయితే అందరిలాగా ఫొటో దిగితే ఏం వెరైటీ అనుకుందో ఏమో కానీ.. ఏనుగు బొమ్మ కిందకు అతికష్టం మీద దూరింది. అనంతరం తన స్టైల్లో ఫొటోకు ఫోజిచ్చింది. అంతే ఏనుగు కాళ్ల మధ్యలోనే చిక్కుకుపోయింది. 
 
ఇక ఆ ఏనుగు విగ్రహం కాళ్ల మధ్యలోకి చిక్కుకున్న ఆమెను అక్కడున్న మహిళలు ముందు వెనకా తోసి బయటికి లాగారు. ముందు నుంచి కొందరు లాగడం వెనక నుంచి కొందరు ఆమెను తోయడంతో కొద్ది నిమిషాల తర్వాత ఆమె విగ్రహం నుంచి బయటపడింది. 
 
ఈ వీడియోను ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. దీంతో క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియోపై కామెంట్లు పేలుతున్నాయి. షేర్లు వెల్లువెత్తుతున్నారు. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments