తెలంగాణ రాష్ట్ర శాసనసభ రద్దు : సీఎం కేసీఆర్ ప్లాన్?

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (14:17 IST)
తెలంగాణ రాష్ట్ర శాసనసభకు వచ్చే యేడాది ఎన్నికలు జరగాల్సివుంది. అయితే, నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీకి చేరారు. 
 
ఇపుడు ఈయనే ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. దీంతో ఈ ఎన్నికలు తెరాసకు అత్యంత కీలకంగా మారాయి. మరోవైపు, ఈ ఎన్నికల్లో గెలుపొంది విజయం సాధించాలన్న పట్టుదలతో బీజేపీ పరితపిస్తుంది. ఈ క్రమంలో తెరాసతో పాటు ఇతర విపక్ష పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. 
 
మరోవైపు, సీఎం కేసీఆర్ తన ఆలోచనలకు పదుపెట్టారు. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపును అడ్డుకోవాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. దీంతో మునుగోడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే అసెంబ్లీని రద్దు చేయాలని ఆయన భాలిస్తున్నట్టు సమాచారం. 
 
సెప్టెంబరు 3న సీఎం కేసీఆర్‌ కేబినెట్‌ సమావేశం, టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ తర్వాత సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకోనున్నారనే అనుమానాలు రాజకీయంగా వినిపిస్తున్నాయి. 
 
అలాగే సామాజిక సంక్షేమ పథకాలపై మంత్రులు, అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని చెబుతున్నారు. ముందుగా అసెంబ్లీ రద్దుకు సిద్ధమని సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశాలు లేకపోలేదని వార్తలు వస్తున్నాయి కూడా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nabha Natesh: నాగబంధం నుంచి పార్వతిగా సాంప్రదాయ లుక్ లో నభా నటేష్

Sai Durga Tej: పంచె కట్టు ధరించిన సాయి దుర్గతేజ్.. సంబరాల ఏటిగట్టు లుక్

రణధీర్ భీసు-హెబ్బా పటేల్ జంటగా మిరాకిల్ సంక్రాంతి లుక్

పూరీ జగన్నాథ్ కొత్త చిత్రం పేరు 'స్లమ్ డాగ్'

NTR: బాడీ తగ్గించుకుని కొత్త లుక్ లో ఎన్.టి.ఆర్. - అనిల్ కపూర్ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ నూతన సంవత్సరంలో సాధారణ అలవాట్ల కోసం పెద్ద తీర్మానాలను చేసుకున్న అనన్య పాండే

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

తర్వాతి కథనం
Show comments