Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానం టైర్లను పట్టుకొని వెళ్ళిన ఆ ఇద్దరు అన్నదమ్ములు... (video)

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (12:59 IST)
మొన్న అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం టైర్లను పట్టుకొని వెళ్లడానికి ప్రయత్నించి ముగ్గురు వ్యక్తులు కింద పడి మరణించిన ఘటనకు సంబంధించిన వీడియో ఎంత వైరల్ అయిందో తెలుసు కదా. ఇది చూసి ప్రపంచమంతా నివ్వెరపోయింది. అయితే తాజాగా అలా కింద పడిన ముగ్గురిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నట్లు ఓ రిపోర్ట్ వెల్లడించింది.
 
వివరాల్లోకి వెళితే.. విమానం నుంచి కింద పడిన ముగ్గురిలో ఇద్దరు తోబుట్టువులు 17 ఏళ్ల రెజా, 16 ఏళ్ల కబీర్ (రిపోర్ట్‌లో పేర్లు మార్చారు) ఉన్నారు. వాళ్లు కింద పడుతున్న సమయంలో చూసిన వాళ్లు ఆ ఇద్దరి వివరాలు వెల్లడి కావడంలో సాయం చేశారు. ఈ ఇద్దరిలో పెద్ద వాడైన రెజా మృతదేహం ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరలోని ఓ భవనంపైన లభించింది. అతని కుటుంబ సభ్యులు గుర్తించారు. కబీర్ జాడ మాత్రం ఇంకా తెలియలేదు. 
 
రెజా కిందపడినప్పుడు అతని కాళ్లు, చేతులూ పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. అతన్ని నేనే తీసుకెళ్లి ఖననం చేశానని ఓ కుటుంబ సభ్యుడు తెలిపాడు. అయితే కబీర్ జాడ మాత్రం ఎంత వెతికినా దొరకలేదని అతడు చెప్పాడు.
 
ఆఫ్ఘనిస్థాన్ మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని తెలియగానే ఈ ఇద్దరు అన్నదమ్ములు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో కెనడా లేదా అమెరికాలో 20 వేల మంది ఆఫ్ఘన్లకు ఆశ్రయమిస్తున్నట్లు ఎవరో ఇరుగుపొరుగు మాట్లాడుకుంటే విని ఈ ఇద్దరూ ఎయిర్‌పోర్ట్‌కు పరుగు తీశారు. 
 
ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తన గుర్తింపు కార్డు తీసుకొని వెళ్లిపోయారని సదరు కుటుంబ సభ్యుడు చెప్పాడు. తాలిబన్లంటే భయంతోనే ప్రతి ఒక్కరూ ఇలా దేశం విడిచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆ వ్యక్తి తెలిపాడు. ఆ కుటుంబంలో మొత్తం 8 మంది సంతానం కాగా.. ఈ ఇద్దరే అందరి కంటే పెద్ద వాళ్లు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments