Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే రోజు బాబుకు రెండు దెబ్బలు: తెలంగాణలో టిడిపి క్లోజ్, వైసిపిలోకి తెదేపా మాజీ ఎమ్మెల్యే

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (20:30 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఒకే రోజు రెండు దెబ్బలు తగిలాయి. ఒకటి తెలంగాణ నుంచి అయితే మరొకటి ఏపీ నుంచి.
 
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు గెలిచారు. ఆ ఇద్దరిలో ఒకరు సండ్ర వెంకట వీరయ్య కాగా మరొకరు మెచ్చా నాగేశ్వర రావు. వీరిరువురిలో సండ్ర కొద్దికాలానికే కారు ఎక్కేశారు. దాంతో మెచ్చా మాత్రమే మిగిలిపోయారు. అలా తెలంగాణలో తెదేపాకి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు.
 
ఐతే ఈరోజు ఉన్న ఏకైక ఎమ్మెల్యే కూడా తెరాస తీర్థం పుచ్చుకున్నారు. దానితో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖతమైపోయినట్లయింది. తమ పార్టీని తెరాసలో విలీనం చేస్తున్న సండ్రతో కలిసి మెచ్చ స్పీకర్ పోచారానికి లేఖ ఇచ్చారు. దీనితో ఆ పార్టీ ఇక తెలంగాణలో కనుమరుగైపోయినట్లే.
 
ఇక ఏపీ విషయానికి వస్తే... బాపట్ల నియోజకవర్గంలో ఎప్పటి నుంచి రాజుల కమ్యూనిటీ తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది. అలాంటిది ఈరోజు తెదేపాకి చెందిన బాపట్ల మాజీ ఎమ్మెల్యే అనంతవర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపి కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు పలువురు నాయకులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా ఒకే రోజు చంద్రబాబుకి రెండు దెబ్బలు తగిలాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments