Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో జనం తీసుకున్న అప్పులన్నీ మాఫీ చేసి పారేస్తారేమో?

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (17:02 IST)
రుణాలు మాఫీ అనే తాయిలంతో ఓట్లను కొల్లగొడుతున్న పార్టీలు ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం మాఫీలు చేస్తున్నాయి. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో ఏకంగా రూ. 650 కోట్ల విలువైన విద్యుత్ బిల్లుల బకాయిలను మాఫీ చేసిపడేసింది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ బిల్లులు కట్టకుండా వున్న మొండి బాకీలన్నీ ఒక్క దెబ్బకు ఎగిరిపోయాయి. ఇంకేం... గుజరాత్ రాష్ట్రంలోని గ్రామీణ జనం హ్యాపీగా కరెంటును ఎంతబడితే అంత ఉపయోగించుకోవచ్చన్నమాట. ఇది భాజపా చేసిన పని.
 
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో రైతుల రుణ మాఫీ హామీ ఇచ్చింది. ఇచ్చినమాట ప్రకారం ఆ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన కమల్‌నాథ్ రెండు గంటల్లోనే రైతు రుణమాఫీపై సంతకం చేసి ఒకే దెబ్బకు కట్టాల్సిన రుణాలన్నీ మాఫీ చేశారు. ఛత్తీస్ గఢ్ లోనూ అదే జరిగింది. 
 
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తాము చెప్పిన పని చేస్తామంటూ వ్యాఖ్యానించారు. అంతే... ఆగ్రహంతో ఊగిపోయిన గుజరాత్ ముఖ్యమంత్రి విద్యుత్ బిల్లుల బకాయిలను మాఫీ చేసి తనేంటో చూపించారు. మరి ఇదే ఊపుతో దేశంలో జనం తీసుకున్న అప్పులన్నీ మాఫీ చేసి పారేస్తారేమో? చూడాలి వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి ఏమయినా జరగొచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments