ఏపీ రాజధాని అమరావతి కాదా? మరికొద్దిరోజుల్లో అక్కడ కన్ఫర్మ్

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (17:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అనీ, నగర నిర్మాణం కోసం 30 వేల ఎకరాలను గత ప్రభుత్వం సమీకరించింది. ఐతే ఆ భూముల్లో రాజధాని నిర్మాణం సురక్షితం కాదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వాదిస్తూ వస్తున్నారు. మరోవైపు అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అక్కడ పనులు చేసే కార్మికులు కూడా వెళ్లిపోయారు. అలా అమరావతి రాజధాని నగరంలో నిర్మాణాలు ఆగాయి.
 
ఇక అసలు విషయానికి వస్తే, కొత్తగా ఏపీ రాజధాని అమరావతి నుంచి నేరుగా మంగళగిరికి మార్చుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వెలగపూడిలో వున్న కార్యాలయాలను మంగళగిరికి తరలించాలన్న యోచనలో జగన్ సర్కార్ వున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం కూడా అదేనని అంటున్నారు. అమరావతి రాజధాని ఏపీకి అనువైంది కాదనీ, మంగళగిరి అయితే అన్నివిధాలా సరిపోతుందని వైసీపీ నాయకులు అంటున్నారు. 
 
ఈ నేపధ్యంలో త్వరలో మంగళగిరి ఏపీ రాజధానిగా నిర్ణయిస్తూ ప్రకటన వెలువడే అవకాశం వుందంటున్నారు. అంతేకాదు... హైకోర్టును కర్నూలుకి తరలించాలనీ, ఇతర ముఖ్యమైన కార్యాలయాలను విశాఖలో పెట్టేందుకు గల అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SSMB29 చిత్రంలో ప్రియాంకా చోప్రా ఫస్ట్ లుక్, గన్ ఫైర్

రష్మిక కోసం వచ్చిన మహిళా అభిమాని.. బౌన్సర్ తోసేయడానికి ప్రయత్నిస్తే? (video)

అప్పట్లో తెలియక బెట్టింగ్ యాప్‌ని గేమింగ్ యాప్ అనుకుని ప్రమోట్ చేసా: ప్రకాష్ రాజ్ (video)

కాంత లాంటి సినిమాలు జీవితంలో ఒక్కసారే వస్తాయి : దుల్కర్ సల్మాన్, రానా

సంతాన ప్రాప్తిరస్తు తెలుగు మీల్స్ తిన్నంత తృప్తి కలిగింది - తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments