Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తమ్ కోటలో వికసించిన గులాబీ : 33 వేల ఓట్ల మెజార్టీ

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (14:47 IST)
తెలంగాణ రాష్ట్రంలో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికలను ఇటు తెరాస, అటు కాంగ్రెస్ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో విజయం కోసం ఇరు పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారం చేశారు. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం చేపట్టగా, మధ్యాహ్నం రెండున్నర గంటలకే తుది ఫలితాన్ని వెల్లడించారు. ఈ ఫలితంలో తెరాస అభ్యర్థిగా పోటీ చేసిన సైదిరెడ్డి ఘన విజయం సాధించారు. ఈయనకు లక్షా ఎనిమిదివేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. 
 
అలాగే, కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డికి 74638 ఓట్లు పోలయ్యాయి. దీంతో తెరాస అభ్యర్థి 33363 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో తెదేపా తరపున పోటీ చేసిన అభ్యర్థిగానీ, బీజేపీ అభ్యర్థిగానీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా ఉత్తమ్ కంచుకోటగా ఉన్న హుజూర్ నగర్ స్థానం ఇపుడు తెరాస వశమైంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments