Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ సీఎంను ఇంట్లోకి అడుగుపెట్టనివ్వను : తేజ్ ప్రసాద్ యాదవ్

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ చేసిన మోసాన్ని ఎన్నటికీ మరచిపోలేమనీ, అందువల్ల మా ఇంట్లోకి అడుగుపెట్టేందుకు ఆయనకు ప్రవేశం లేదనీ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. బీజేపీతో కటీఫ్ చెప్పి మళ్లీ

Webdunia
మంగళవారం, 3 జులై 2018 (17:31 IST)
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ చేసిన మోసాన్ని ఎన్నటికీ మరచిపోలేమనీ, అందువల్ల మా ఇంట్లోకి అడుగుపెట్టేందుకు ఆయనకు ప్రవేశం లేదనీ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. బీజేపీతో కటీఫ్ చెప్పి మళ్లీ ఆర్జేడీతో చేతులు కలిపేందుకు నితీశ్ కుమార్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటికెళ్లి వారిని బుజ్జగించేందుకు నితీశ్ ప్రయత్నిస్తున్నారు.
 
ఉపముఖ్యమంత్రిగా పని చేసిన తేజ్ ప్రసాద్ యాదవ్... బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను తన ఇంట్లోకి కూడా రానివ్వబోనని తేల్చి చెప్పారు. పైగా, తన ఫేస్‌బుక్ ఖాతాను బీజేపీ - ఆర్సెస్ హ్యాక్ చేసిందని ఆయన ఆరోపించారు. తనకు పెరుగుతున్న పాపులారిటీని చూసి తట్టుకోలేక సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం నితీశ్ కుమార్ తన సోషల్ మీడియా ప్రోఫైల్స్‌ను హ్యాక్ చేస్తున్నారన్నారు. 
 
మహాకూటమి నుంచి విడిపోయిన నితీశ్… మళ్లీ ఆ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో మహాకూటమిలోకే కాదు… నితీశ్‌ను తన ఇంటికి కూడా రానివ్వబోనని చెప్పారు. అంతేకాకుండా, 'నో ఎంట్రీ నితీశ్ చాచా' అనే పేపర్‌ను ఇంటి గేట్‌కు అతికించారు. 
 
కొంతకాలంగా వివిధ అంశాలపై నితీశ్ బహిరంగంగానే బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీహార్‌కు స్పెషల్ స్టేటస్, డీమానిటైజేషన్, జీఎస్టీ వంటి అంశాలపై బీజేపీపై బహిరంగంగానే నితీశ్ విమర్శలు చేశారు. దీంతో నితీశ్ బీజేపీని వదిలిపెట్టి మహాకూటమిలోకి వస్తున్నారనే వార్తలు కొంతకాలంగా అటు సోషల్ మీడియాలో కూడా హాల్‌చల్ చేస్తున్నాయి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments