Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ - జనసేనలు కలిసి పోటీ చేయొచ్చు : టీజీ వెంకటేష్

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (16:24 IST)
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన పార్టీలు మళ్లీ కలిసి పోటీ చేయొచ్చంటూ టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం సమాజ్‌వాదీ - బహుజన్ సమాజ్‌వాదీ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయని అందువల్ల ఏపీలో కూడా టీడీపీ - జనసేనలు కలిసి పోటీ చేయడంలో తప్పులేదన్నారు. 
 
పైగా, ఈ రెండు పార్టీల మధ్య రాష్ట్ర స్థాయిలో ఎలాంటి వైరం లేదన్నారు. కానీ, రాష్ట్రానికి జరిగిన అన్యాయం విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నిలదీసే విషయంలోనే టీడీపీ - జనసేనల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయని చెప్పారు. 
 
ఇకపోతే, కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ కేటాయింపులో ఎలాంటి గందరగోళం లేదనీ, కానీ ఎస్వీ మోహన్ రెడ్డి మాత్రం ఈ టిక్కెట్‌ను తనకే కేటాయిస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ కారణంగానే కొంత గందరగోళం నెలకొందన్నారు. వాస్తవానికి సర్వే ఫలితాల మేరకు ఈ సీటును పార్టీ అధినేత కేటాయిస్తారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments