Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేన్సర్ రోగుల పట్ల విద్యార్థినుల ఔదార్యం.. శిరోజాల దానం

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (15:49 IST)
కేన్సర్ రోగుల పట్ల కొందరు విద్యార్థులు తమ ఔదార్యాన్ని చూపించారు. ఇందులోభాగంగా, వారు తమ శిరోజాలను దానంగా ఇచ్చారు. ఈ మానవతా దృక్పథంతో కూడిన చర్య తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కోయంబత్తూరు జిల్లాలో ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీకి చెందిన విద్యార్థినులు కేన్సర్ రోగులకు ఏదో రూపంలో సాయం చేయాలని భావించారు. ఇందులోభాగంగా, వారు కేన్సర్‌ నిర్ధారణ అయిన రోగులకు తమ వెంట్రుకలను దానం చేశారు. 
 
సాధారణంగా కేన్సర్ నిర్ధారణ అయిన రోగులకు జుట్టును కత్తిరిస్తారు. అలాంటి రోగులకు జుట్టు దానం చేసి వారిలో ఆనందాన్ని నింపాలనే సంకల్పంతోనే ఇలాంటి చర్యకు పూనుకున్నారు. ఈ ప్రైవేటు కాలేజీకి చెందిన 80 మంది విద్యార్థినిలు తమ జుట్టును కేన్సర్‌ రోగులకు దానంగా ఇచ్చారు. ఈ జుట్టుతో విగ్‌లను తయారు చేసి కేన్సర్‌ పేషెంట్లకు ఇవ్వనున్నారు. 
 
తమ ఔదార్యంపై పలువురు విద్యార్థినిలు స్పందిస్తూ, కేన్సర్‌ రోగులకు ఆర్థికంగా సహాయం చేయలేం. కానీ, వారు వెంట్రుకలు లేక బాధపడుతుంటారు. ఇలాంటివారికి తమ జుట్టును దానం చేసి.. వారిలో ఆనందాన్ని నింపాలనుకున్నాం. అందుకే తామంతా కలిసి సామూహికంగా శిరోజాలను దానం చేసినట్టు చెప్పారు. కేన్సర్ రోగుల పట్ల మానవీయ కోణంలో ఆలోచించిన విద్యార్థినులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments