శ్రీనివాస్ గుప్తా సంథింగ్ స్పెషల్.. భార్య లేదని ఆమె మైనపు బొమ్మతో గృహప్రవేశం (video)

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (17:37 IST)
కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా తన భార్య మైనపు విగ్రహాన్ని తయారుచేయించి తను కొన్న కొత్త ఇంటిలోకి గృహప్రవేశం చేశారు. కొన్నేళ్ల క్రితం గుస్తా సతీమణి రోడ్డు ప్రమాదంలో మరణించారు. భార్య అంటే గుప్తాకు ఎనలేని ప్రేమ. అందుకే తన ఇంటి శుభకార్యానికి భార్య మైనపు బొమ్మను చేయించి అందరనీ ఆశ్చర్యపరిచాడు ఈ పెద్దాయన.
 
గుండెల్లో గుడి కట్టుకోవడమే కాదు. ఏకంగా జీవకళ ఉట్టి పడుతున్న ఆమె మైనపు విగ్రహాన్నే తయారు చేయించి ఇంట్లో పెట్టుకున్నారీ గుప్తా. రాజసూయ యాగానికి ఆనాడు శ్రీరాముడు స్వర్ణ సీతమ్మను తయారు చేయిస్తే... నేటి ఈ శ్రీనివాస్ గృహ ప్రవేశానికి ఏకంగా మైనపు సతీమణినే చేయించాడు.
భార్య బతికి వుండగానే ప్రత్యక్ష నరకం చూపించే మగానుభావులు, పొద్దున లేస్తే అర్థాంగి మీద కుళ్లు జోకులు వేస్తూ పలుచన చేసే భర్త గార్లు ఉన్న ఈ లోకంలో నిజంగా శ్రీనివాస్ గుప్తా సమ్ థింగ్ స్పెషల్. ఇంతకీ చెప్తే గానీ తెలిసేలా లేదు.. ఆమె కాదు అది మైనపు బొమ్మ అని. ఆ నవ్వు, చీర, నగలు ఎంత సహజంగా ఉన్నాయో. ఈ అద్భుతాన్ని సృష్టించిన కళాకారులూ కూడా  అభినందనీయులే..!! నిజంగా గుప్తా భార్య ఎంత అదృష్టమంతురాలో కదా...

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments