Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనూసూద్ పంజాబ్ సీఎం అవ్వడం ఖాయం, ఎలా? (Video)

Webdunia
సోమవారం, 27 జులై 2020 (20:08 IST)
ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు. సోనూసూద్ ఏ పార్టీలో లేడు. సోనూసూద్ సిఎం అవ్వడమేంటి అనుకుంటున్నారా. సిఎం అవ్వడానికి ఎన్నికలు అవసరం లేదు. పార్టీ అవసరం లేదు. ప్రజల అభిమానం చాలు అని నిరూపించాడు సోనూసూద్. తన గొప్ప వ్యక్తిత్వాన్ని మరోసారి చాటుకున్నాడు.
 
కరోనా సమయంలో స్వస్థలాలకు వెళ్ళలేక ఇబ్బందులు పడుతూ తినడానికి తిండిలేని పరిస్థితుల్లో ఉన్న వలసకూలీలను తన సొంత డబ్బులతో గమ్యస్థానాలకు చేర్చారు సోనూసూద్. ప్రాంతం కాదు, కులం కాదు, మతం కాదు మనషులందరూ ఒక్కటేనని నమ్మే వ్యక్తి సోనూసూద్.
 
అందుకే ఎవరికైనా కష్టమంటే అక్కడ వాలిపోతాడు. అదే పనిచేశాడు సోనూసూద్. ఎక్కడో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో రైతు ఇబ్బందులు పడుతుంటే వారికి తన వంతుగా సహాయాన్ని అందించాడు. రైతు నాగేశ్వరరావు కూతుర్లు ఇద్దరూ కాడెను రెండు వైపులా పట్టుకుని పొలం దున్నతుంటే వారికి ట్రాక్టర్ తీసిచ్చాడు.
 
అయితే దీనిపై సోనూసూద్‌ను ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశంలోని ప్రతి ఒక్కరు సోనూను అభినందిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సోనూసూద్ పంజాబ్ వాసి. ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి అన్ని విధాలుగా అర్హుడు. ఇలాంటి వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉండాలి. సోనూసూద్ మీరు గ్రేట్. 
 
ఎంతోమంది హీరోలున్నారు. ఎందుకు పనికిరారు. విలన్ వేషాలు వేసే మీలో నిజమైన హీరో ఉన్నాడు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగితే సోనూసూద్ సిఎం అవ్వడం ఖాయమంటూ అభిమానులు ట్వీట్ చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments