Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాపకింద నీరులా తెలుగు నెటిజన్ల ప్రచారం ... కమలనాథులకు నిద్ర కరవు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 12వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల కోసం పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించేందుకు అన్ని విపక్ష రాజకీయ పార్టీలతో పాటు... కర్ణ

Webdunia
శనివారం, 7 ఏప్రియల్ 2018 (12:27 IST)
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 12వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల కోసం పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించేందుకు అన్ని విపక్ష రాజకీయ పార్టీలతో పాటు... కర్ణాటకలోని తెలుగు ప్రజలు కూడా కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు 
 
ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఇపుడు జాతీయ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ వివాదమే కర్ణాటకలో బీజేపీ కొంప ముంచేలా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలులో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని ఏపీలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దాని ప్రభావం ఇతర రాష్ట్రాల్లోని తెలుగు వారిపైనా ఉందని భావిస్తున్నారు. 
 
హోదా విషయంలో టీడీపీ ఎన్‌డీఏ కూటమి నుంచి బయటకు రావడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. అప్పటి నుంచి టీడీపీ-బీజేపీల మధ్య ఉప్పూనిప్పూ అన్నట్లు రగులుతోంది. మే నెలలో జరిగే కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో దీని ప్రభావం కనిపించనుంది. ముఖ్యంగా ఏపీ సరిహద్దు జిల్లాల్లో ఎక్కువ మందికి ఆంధ్రా మూలాలతో ఇంకా సంబంధాలున్నాయి. 
 
వచ్చే ఎన్నికల్లో వీరిని బీజేపీకి ఓటేయకుండా చేయడమే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు కదులుతున్నాయి. తెలుగుదేశం నాయకత్వం నుంచి ప్రత్యేక ఆదేశాలేవీ లేకపోయినా సోషల్‌ మీడియా ద్వారా, సామాజికవర్గ సమావేశాల ద్వారా చాప కింద నీరులా ప్రచారం చేస్తున్నారు. మొత్తంమీద ప్రత్యేక హోదా అంశం కమలనాథుల కంటిపై కునుకులేకుండా చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments