Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను నెగ్గిన జనసేన పార్టీ వుంటుందో లేదో? మళ్లీ రాపాక రచ్చరచ్చ వ్యాఖ్యలు

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (13:56 IST)
జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. సహజంగానే పార్టీ నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచినపుడు ఆయనకు పార్టీలో వుండే వెయిటేజి చాలా ఎక్కువ. కానీ రాపాక మాత్రం తను నెగ్గిన పార్టీ మాత్రం వట్టి డొల్ల అంటున్నారు. అసలు వుంటుందో వుండదో కూడా డౌటేనంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తను 2019 ఎన్నికల్లో వైసిపి నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారైన దశలో అనూహ్యంగా తనకు టిక్కెట్ దక్కలేదన్నారు. దానితో తను ఇంట్లో గమ్మున కూర్చుండిపోతే, జనసేన నుంచి కొంతమంది నాయకులు తన ఇంటికి వచ్చి టిక్కెట్ ఇస్తాం, పోటీ చేయమని బ్రతిమాలాడారన్నారు. అలా ఎన్నికల బరిలో దిగితే పార్టీ అంటే ఇష్టం లేకపోయినా వ్యక్తిపై వున్న ఇష్టంతో తనను ప్రజలు గెలిపించారన్నారు.
 
జనసేన నుంచి గెలిచిన తర్వాత తను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశాననీ, ఆ సందర్భంలో తనకు టిక్కెట్ ఇవ్వలేకపోవడంపై జగన్ ఒకింత ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఐతే కలిసి ముందుకు సాగుదామని చెప్పారన్నారు. ఆయన ఆ మాట చెప్పిన రోజు నుంచి నేను వైకాపాను అనుసరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. జగన్ నేతృత్వంలో నియోజకవర్గం అభివృద్ధిని బ్రహ్మాండంగా చేస్తున్నానని అన్నారు. మరి రాపాక వ్యాఖ్యలపై జనసేన అధినాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments