Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయితే ఓకే.. మహిళలందరికీ అయ్యప్ప దర్శనం... సమ్మతించిన దేవస్థాన బోర్డు

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (19:03 IST)
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనంకు ఇకపై మహిళలు కూడా వెళ్లొచ్చు. ఈ మేరకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీపీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నిర్ణయం గతంలో అనుసరించిన తీరుకు పూర్తి విరుద్ధం కావడం గమనార్హం. కాగా, ఈ ఆలయ పర్యవేక్షణ బాధ్యతలను ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు చూస్తోంది.
 
కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని గతంలో ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఏ ఎం ఖన్విల్కర్, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది. 
 
ఈ సందర్భంగా నాయర్ సర్వీస్ సొసైటీ తరపున సీనియర్ న్యాయవాది కే పరాశరన్ వాదనలు వినిపించారు. ఈ తీర్పును రద్దు చేయాలని కోరారు. ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు తన వైఖరిని పూర్తిగా మార్చుకుంది. అన్ని వయసుల మహిళలను దేవస్థానంలోకి అనుమతించాలని సుప్రీంకోర్టుకు తెలిపింది.
 
రాజ్యాంగ ధర్మాసనంలోని జస్టిస్ ఇందు మల్హోత్రా బోర్డు తరపు న్యాయవాదిని ఉద్దేశించి మాట్లాడుతూ రిట్ పిటిషన్లపై తీర్పు సందర్భంగా చేసిన వాదనలో మార్పు వచ్చిందా? అని అడిగారు. దీనిపై బోర్డు తరపు న్యాయవాది సమాధానం చెప్తూ 'ఔను, తీర్పును గౌరవించాలని బోర్డు నిర్ణయించింది, దీనికి సంబంధించి దరఖాస్తు కూడా చేసింది' అని చెప్పింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం