Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైల బట్టలను ఇరుముడిలో పెట్టుకుని.. శబరిమలకు వచ్చిన రెహానా..

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (10:32 IST)
శబరిమల అయ్యప్ప సన్నిధానంలోకి అన్ని వయస్కుల మహిళలను ప్రవేశించవచ్చునని సుప్రీం కోర్టు తీర్పు నిచ్చిన నేపథ్యంలో.. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు కొందరు మహిళలు శబరిమలకు వెళ్లారు. అందులో రెహానా ఒకరు.


శబరిమలలోని అయ్యప్ప సన్నిధానానికి అత్యంత దగ్గరగా వెళ్లి, వెనుదిరిగి వచ్చిన ముస్లిం యువతి రెహానా ఫాతిమాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను అరెస్ట్ చేసిన మరుసటి రోజే ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించినట్లు బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది. 
 
రెహానా బీఎస్ఎన్ఎల్‌లో టెలికాం టెక్నీషియన్‌గా పనిచేస్తుండగా.. ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించింది. కాగా సెప్టెంబర్ 30న ఫాతిమా.. తన ఫేస్‌బుక్ పేజీలో ఓ పోస్టు పెట్టింది. ఆ ఫేస్‌బుక్ పేజీలో శబరిమలకు వెళ్లిన ఫోటోను పోస్టు చేశారు. నీలక్కల్ వద్ద చేరుకున్న ఆమెను పోలీసులు సన్నిధానం వరకు తీసుకెళ్లగలిగారు. 
 
అయితే భక్తుల నిరసనలతో ఆమె వెనుదిరిగి రాగా, ఆ తర్వాత ఆమె మైల బట్టలు ఇరుముడిలో పెట్టుకుని వచ్చిందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె నివాసాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రెహానాను ముస్లింల నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటన కూడా విడుదలైంది. తాజాగా ఆమె ఉద్యోగం కూడా ఊడింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments