Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్ ప్రభుత్వ వైద్య కాలేజీలో ర్యాగింగ్

Webdunia
బుధవారం, 27 జులై 2022 (14:43 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ర్యాగింగ్ భూతం వెలుగు చూసింది. ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కాలేజీలో జూనియర్ విద్యార్థులను సీనియర్ వైద్య విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో వేధించారు. కొందరు ఎంబీబీఎస్ సీనియర్ విద్యార్థులు జూనియర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. పైగా, నోటికి వచ్చినట్టుగా దుర్భాషలాడుతూ రెచ్చిపోయారు. 
 
ఈ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఉన్న ప్రభుత్వ వైద్య కాలేజలో ఈ ఘటన జరిగింది. ర్యాగింగ్ ఘటన తర్వాత జూనియర్లు యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దిండుతో, బ్యాచ్‌మేట్స్‌తో అసహజ శృంగారం చేయాలంటూ జూనియర్లను సీనియర్లు వేధించారు. 
 
ఈ ఫిర్యాదుపై తక్షణం స్పందించిన యూజీసీ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఈ ఘటనపై చర్య తీసుకోవాలని కోరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి జూనియర్ విద్యార్థులు వాంగ్మూలాన్ని తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

Varalakshmi : వరలక్ష్మి శరత్ కుమార్ నిర్మాతగా దోస డైరీస్ బేనర్ లో సరస్వతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments