Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హంతకులు చచ్చేంత వరకు జైల్లో ఉండాల్సిందే...

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని హత్య చేసిన నిషేధిత ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థకు చెందిన హంతకులను వదిలిపెట్టే విషయంలో ఏమాత్రం దయాదాక్షిణ్యాలు చూపే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు దేశ అత్య

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (16:35 IST)
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని హత్య చేసిన నిషేధిత ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థకు చెందిన హంతకులను వదిలిపెట్టే విషయంలో ఏమాత్రం దయాదాక్షిణ్యాలు చూపే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఓ అఫిడవిట్ సమర్పించింది.
 
ఎల్టీటీఈకి చెందిన ఓ మహిళ మానవబాంబుగా మారి.. 1991, మే 21న రాజీవ్ గాంధీని హతమార్చిన విషయం తెల్సిందే. ఈ కేసులో దోషులు గత 27 ఏళ్లుగా జైలు శిక్షలను అనుభవిస్తున్నారు. ఈ ఏడుగురు ముద్దాయిలను విడుదల చేయాలని తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. 
 
అయితే, వీరిని విడుదల చేసే ప్రసక్తే లేదని కేంద్రప్రభుత్వం స్పష్టంచేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు క్లారిటీ ఇచ్చింది. వాళ్లను విడిచిపెడితే దేశంతోపాటు ప్రపంచానికి కూడా తప్పుడు సందేశం ఇచ్చినట్లు అవుతుందని కేంద్రం అభిప్రాయపడింది. 
 
రాజీవ్ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురిని.. విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. సర్కార్ నిర్ణయాన్ని సీబీఐ వ్యతిరేకించింది. రాష్ట్రపతి కూడా దోషుల విడుదలను నిరాకరించారు. దోషులపై ఏమాత్రం జాలి చూపాల్సిన అవసరం లేదని హోంశాఖ స్పష్టంచేసింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments