Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హంతకులు చచ్చేంత వరకు జైల్లో ఉండాల్సిందే...

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని హత్య చేసిన నిషేధిత ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థకు చెందిన హంతకులను వదిలిపెట్టే విషయంలో ఏమాత్రం దయాదాక్షిణ్యాలు చూపే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు దేశ అత్య

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (16:35 IST)
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని హత్య చేసిన నిషేధిత ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థకు చెందిన హంతకులను వదిలిపెట్టే విషయంలో ఏమాత్రం దయాదాక్షిణ్యాలు చూపే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఓ అఫిడవిట్ సమర్పించింది.
 
ఎల్టీటీఈకి చెందిన ఓ మహిళ మానవబాంబుగా మారి.. 1991, మే 21న రాజీవ్ గాంధీని హతమార్చిన విషయం తెల్సిందే. ఈ కేసులో దోషులు గత 27 ఏళ్లుగా జైలు శిక్షలను అనుభవిస్తున్నారు. ఈ ఏడుగురు ముద్దాయిలను విడుదల చేయాలని తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. 
 
అయితే, వీరిని విడుదల చేసే ప్రసక్తే లేదని కేంద్రప్రభుత్వం స్పష్టంచేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు క్లారిటీ ఇచ్చింది. వాళ్లను విడిచిపెడితే దేశంతోపాటు ప్రపంచానికి కూడా తప్పుడు సందేశం ఇచ్చినట్లు అవుతుందని కేంద్రం అభిప్రాయపడింది. 
 
రాజీవ్ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురిని.. విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. సర్కార్ నిర్ణయాన్ని సీబీఐ వ్యతిరేకించింది. రాష్ట్రపతి కూడా దోషుల విడుదలను నిరాకరించారు. దోషులపై ఏమాత్రం జాలి చూపాల్సిన అవసరం లేదని హోంశాఖ స్పష్టంచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments