Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు నుంచి కిందకు దూకిన మహిళ, ఆ తర్వాత?

Webdunia
బుధవారం, 5 మే 2021 (14:51 IST)
తిరుపతి రైల్వేస్టేషన్లో మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. స్టేషన్లో ట్రైన్ ఆగకముందే దిగాలని ప్రయత్నం చేయడంతో కాలుజారి ట్రైన్‌కు మధ్యలో పడిపోయింది. అదే టైంలో ఫ్లాట్‌ఫాంపై విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సతీష్ చాకచక్యంగా ఆమెను బయటకు లాగాడు.
 
దీంతో ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. గాజువాకకు చెందిన భార్యాభర్తలు తిరుమల శ్రీవారి దర్సనార్థం తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో నిన్న సాయంత్రం వైజాగ్ నుంచి బయలుదేరారు. ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల సమయంలో తిరుమల ఎక్స్‌ప్రెస్ తిరుపతి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది.
 
అయితే గాఢనిద్రలో ఉన్న భార్యాభర్తలు రైలు తిరుపతి రైల్వేస్టేషన్ లోని ఫ్లాట్ ఫాంపై ఉందన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. రైలు కదులుతుండగా ఉన్నట్లుండి మహిళకు మెలుకువ వచ్చింది. భర్తకు చెప్పి నిద్రలేపే లోపే రైలు కదిలింది. 
 
ఆతృతగా రైలు దిగేందుకు మహిళ ప్రయత్నించి చివరకు ఫ్లాట్‌ఫాం కింద పడిపోతుండగా విధుల్లో ఉన్న సతీష్ అనే రైల్వే పోలీసు చాకచక్యంగా ఆమె ప్రాణాలను కాపాడాడు. సతీష్‌ను రైల్వేశాఖ ఉన్నతాధికారులు అభినందించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments