Webdunia - Bharat's app for daily news and videos

Install App

హౌడీ మోడీతో భారత్ గౌరవం పెరిగింది : నరేంద్ర మోడీ

Webdunia
ఆదివారం, 29 సెప్టెంబరు 2019 (13:07 IST)
ప్రపంచ వేదికపై హౌడీ మోడీ అనే కార్యక్రమంతో భారత్ ప్రతిష్ట, గౌరవం పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించిన ఆయన.. శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. 
 
అపుడు వారిని ఉద్దేశించిన నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ, '2014లోనూ అమెరికా వెళ్లాను. ఐరాస సమావేశాల్లో పాల్గొన్నాను. ఇప్పుడు కూడా వెళ్లాను. ఈ ఐదేళ్లలో భారత్‌ పట్ల ప్రపంచ దేశాల దృక్పథంలో భారీ మార్పు చూశాను. భారత్‌ అంటే ఆసక్తి, గౌరవం మరింత పెరిగాయి' అని చెప్పుకొచ్చారు. 
 
హ్యూస్టన్‌లో అట్టహాసంగా జరిగిన హౌడీ మోడీ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, పలువురు డెమొక్రాట్, రిపబ్లికన్‌ పార్టీల నేతలు హాజరుకావడాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంతో భారత్ సత్తా అంటే ఏంటో తెలియవచ్చిందన్నారు. 
 
ముఖ్యంగా ప్రవాస భారతీయుల ఉత్సాహం తననెంతో ఆకర్షించిందన్నారు. మూడేళ్ల క్రితం పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ను కూడా మోడీ గుర్తుచేశారు. 'మూడేళ్ల క్రితం నాటి ఈ రోజును మర్చిపోలేను. ఫోన్‌ కాల్‌ కోసం ఎదురు చూస్తూ ఆ రాత్రంతా నిద్రపోలేదు' అని చెప్పారు. భారతీయులను గర్వపడేలా చేసిన భారతీయ సైనికుల సాహసానికి గుర్తుగా ఆ రోజు నిలిచిపోతుందని చెప్పారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ధనుష్‌తో ప్రేమాయణంపై మృణాల్ ఏమందంటే..? తప్పుగా..?

ఆర్ నారాయణమూర్తి యూనివర్సిటీ పేపర్ లీక్ నాకు బాగా నచ్చింది : త్రివిక్రమ్ శ్రీనివాస్

యువతను ఆకట్టుకునేలా మ్యానిప్యూలేటర్ టైటిల్ వుందన్న బి.గోపాల్

GMB: మహేష్ బాబు నిర్మిస్తున్న రావు బహదూర్ చిత్రం నుంచి సత్య దేవ్ ఫస్ట్ లుక్

గోవాలో తాగిపడిపోతే సుప్రీత ఆ పని చేసింది : అమర్ దీప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments