పెన్నా నది ఉగ్రరూపం, రైల్వే ట్రాక్ పైకి వరద నీరు, నిలిచిపోయిన అనేక రైళ్లు

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (13:33 IST)
పెన్నా నది ఉధృతంగా ప్రవహించడంతో రాష్ట్రంలోని దక్షిణ, తూర్పు ప్రాంతాలను కలిపే ప్రధాన రైలు- రహదారి మార్గాలు ఆదివారం నాడు తాత్కాలికంగా నిలిపివేసారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.

 
కోస్తా ఆంధ్రలో వర్షాల కారణంగా కనీసం 25 మంది మరణించారు. 17 మంది తప్పిపోయినట్లు అధికారులు చెపుతున్నారు. నెల్లూరు జిల్లా పడుగుపాడు వద్ద రైల్వే ట్రాక్‌ పైకి వరద పొంగిపొర్లడంతో చెన్నై-విజయవాడ రైలు మార్గంలో కనీసం 17 ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. మరో మూడు రైళ్లు పాక్షికంగా రద్దు చేయబడ్డాయి. నెల్లూరు ఆర్టీసీ బస్ స్టేషన్‌లో బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో వందలాది మంది ప్రయాణికులు ఇరుక్కుపోయారు.

 
కేరళలోని పతనంతిట్ట జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా శనివారం పంబ, శబరిమల యాత్రలను నిలిపివేశారు. పంబా నదిలో నీటి మట్టాలు పెరుగుతున్నాయని, కక్కి-అనాతోడ్ రిజర్వాయర్, పంబ డ్యామ్ రెండింటిలో రెడ్ అలర్ట్‌లు ఉన్నాయని జిల్లా కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments