Webdunia - Bharat's app for daily news and videos

Install App

''పప్పు'' ఇప్పుడు పరమ పూజ్యుడైనాడు.. రాహుల్ గాంధీపై రాజ్ థాక్రే

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (16:01 IST)
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాక్రే కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీని ప్రశంసించారు. ''పప్పు'' అని పిలువబడిన రాహుల్ గాంధీ ప్రస్తుతం ''పరమ పూజ్యుడు'' అయ్యాడని రాజ్ థాక్రే పేర్కొన్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని థాక్రే ఎత్తిచూపారు.


కాంగ్రెస్ సారథిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలో రాహుల్ గాంధీ.. ఎలాంటి ఫలితాలను రాబట్టారో ఎన్నికల ఫలితాలను
బట్టి అర్థం చేసుకోవచ్చునని థాక్రే తెలిపారు. మధ్యప్రదేశ్‌లో కూడా స్వతంత్ర్యులు, స్థానిక పార్టీల అండతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వుందని థాక్రే వ్యాఖ్యానించారు. 
 
రాహుల్ గాంధీ గుజరాత్, కర్ణాటక ఎన్నికల్లోనూ అదరగొట్టారని.. ఒక్కడైనప్పటికీ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని.. అయితే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రవర్తనతో బీజేపీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయిందని మండిపడ్డారు.

గత నాలుగేళ్లలో అమిత్ షా, మోదీ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసారని.. ప్రజల ఆదరణను కోల్పోయారన్నారు. సమర్థతతో కూడిన ప్రజాభీష్ట పాలన చేయడంలో బీజేపీ సర్కారు విఫలమైందని రాజ్ థాక్రే ఫైర్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments