Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్ర నుంచి ఆక్సిజన్ ప్లాంట్లు ప్రారంభిస్తా: సోనూ సూద్

Webdunia
శనివారం, 22 మే 2021 (19:55 IST)
తాను తలపెట్టిన ఆక్సిజన్​ ప్లాంట్ల ఏర్పాటును ఆంధ్రప్రదేశ్​ నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు సోనూసూద్. కర్నూలులో తొలి ప్రాధాన్యంగా ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
 
లాక్​డౌన్​ మొదలైనప్పటి నుంచి ఎంతోమందికి సాయం చేస్తున్న నటుడు సోనూసూద్​. తన ఆధ్వర్యంలోని తొలి సెట్​ ఆక్సిజన్​ ప్లాంట్లను ఆంధ్రప్రదేశ్​లో ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.
 
 కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి, నెల్లూరు ఆత్మకూరులోని జిల్లా ఆస్పత్రిలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే మిగతా రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్​ ప్లాంట్లను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా తనను కోరిన ఎంతోమందికి ఆక్సిజన్​ కాన్సట్రేటర్​లను అందించారు సోనూసూద్.
 
 ఇవి సరిపోకపోవడం వల్ల విదేశాల నుంచి ఆక్సిజన్​ ప్లాంట్లను తెప్పించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే తొలి ప్రాధాన్యంగా ఆంధ్రప్రదేశ్​లో ఆక్సిజన్​ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Atharva Murali: అథర్వ మురళీ యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్ రాబోతోంది

ఐదు రూపాయల కాయిన్ ఎందుకు బ్యాన్ అయింది అనే కథతో చంద్రహాస్ కాయిన్ చిత్రం

Manoj: మా అమ్మ, అక్క కళ్ళల్లో ఆనందం చూశాను : మంచు మనోజ్

Vijay: టాలెంట్ ఉందోలేదో తెలీదు, ఆ డైరెక్టర్ తో వంద దేవుళ్ళు చేస్తున్నా : విజయ్ ఆంటోనీ

హరికథ రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేసిన మంత్రి వాకిటి శ్రీహరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

హైదరాబాద్‌లో సిగ్నేచర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న జోస్ అలుక్కాస్

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

Mustard oil: ఆవనూనెతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా..?

తర్వాతి కథనం
Show comments