Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సేమ్ సీన్' రిపీట్... లోక్‌సభ 37 సెకన్లకే... రాజ్యసభ రేపటికి వాయిదా

పార్లమెంట్ ఉభయ సభలు మరోమారువాయిదా పడ్డాయి. ప్రధాని మోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం, వైకాపా పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చించాలంటూ ఆ రెండు పార్టీలకు చెందిన ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. కాన

Webdunia
బుధవారం, 21 మార్చి 2018 (11:33 IST)
పార్లమెంట్ ఉభయ సభలు మరోమారువాయిదా పడ్డాయి. ప్రధాని మోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం, వైకాపా పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చించాలంటూ ఆ రెండు పార్టీలకు చెందిన ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. కానీ, ఉభయ సభల్లో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. 
 
దీనికి కారణంలేకపోలేదు. కావేరీ జలాల పంపిణీ కోసం కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే, రిజర్వేషన్ల పెంపుపై తెరాస ఎంపీలు ఆందోళనలకు దిగాయి. ఈ రెండు పార్టీలు వెల్‌లోకి దూసుకొచ్చి సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. దీంతో సభలో రభస చోటుచేసుకుంది. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంత వారించినా విపక్షాలు వినకపోవడంతో ఆమె సభ ప్రారంభమైన 37 సెకన్లకే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.
 
మరోవైపు రాజ్యసభలోనూ ఇదే సీను చోటుచేసుకుంది. తమ డిమాండ్ల సాధన కోసం సభలో విపక్ష అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్‌లు అందోళనలు చేపట్టాయి. సభా సజావుగా ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలించలేదంటూ రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సభను ఏకంగా గురువారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. దీంతో తమ తదుపరి కార్యాచరణపై విపక్షాలు దృష్టి సారిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments