Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరీబియన్ దీవుల్లో ఆవాసం - కైలాస పేరిట రిజర్వు బ్యాంకు

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2020 (14:17 IST)
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి సొంతంగా కైలాస పేరుతో ఓ రిజర్వు బ్యాంకును ఏర్పాటు చేశారు. అత్యాచార ఆరోపణలతో దేశ విడిచి పత్తాలేకుండాపారిపోయిన ఈయన ప్రస్తుతం కరేబియన్ దీవుల్లో తలదాచుకుంటున్నట్టు సమాచారం.
 
అక్కడ ఓ దీవిని సొంతం చేసుకుని దానికి 'కైలాస' అనే పేరు పెట్టి... ఓ దేశంగా ప్రకటించారు. తన దేశానికి సంబంధించి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ కైలాస' నెలకొల్పారు. రిజర్వ్ బ్యాంకు అన్న తర్వాత కరెన్సీ ఉండాలి కదా... దాంతో కైలాస దేశముద్రతో నోట్లు, నాణేలు కూడా విడుదల చేశారు. ఈ నాణేలు బంగారంతో తయారైనవని కైలాస దేశాధిపతి నిత్యానంద సెలవిచ్చారు.
 
ఇక, తమ రిజర్వ్ బ్యాంకు విధివిధానాలను కూడా ఆయన వివరించారు. ఏ దేశానికి చెందిన కరెన్సీ అయినా కైలాస దేశంలో చెల్లుబాటు అవుతుందని, తమ కైలాస కరెన్సీ కూడా అన్ని దేశాల్లో చెల్లుబాటు అవుతుందన్నారు. ఈ మేరకు అనేక దేశాల బ్యాంకులతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు. ఇందులో ఎంతమాత్రం వాస్తవం ఉందనేది భవిష్యత్తులో తేలనుంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments