Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ దోషుల ఉరి అమలును ప్రత్యక్ష ప్రసారం చేయాలి : సుప్రీంలో పిల్

Webdunia
శనివారం, 14 డిశెంబరు 2019 (14:41 IST)
నిర్భయ అత్యాచార కేసులో దోషులకు అమలు చేసే ఉరిశిక్షలను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అంతేకాకుండా, అమెరికాలో ఉన్న తరహాలోనే ఈ కామాంధులను మృతురాలు నిర్భయ తల్లిదండ్రుల సమక్షంలోనే ఉరితీయాలని పిటిషనర్ కోరారు. 
 
కాగా, నిర్భయ కేసు దోషుల ఉరిశిక్షకు కౌంట్‌‌డౌన్ మొదలైంది. అధికారుల నుంచి ఫలానా రోజు ఉరి తీస్తున్నామని అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ తలారి కోసం వెతుకులాట, ఉరి తాళ్లను సిద్దం చెయ్యడం వంటి పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వారిని త్వరలోనే మరణ శిక్ష ఖాయమనే ప్రచారం రోజురోజుకూ సాగుతోంది. 
 
కాకపోతే ఉరిని అమలు చేసే విషయంలో మరికొన్ని రోజులు జాప్యం జరిగేలా కనిపిస్తుంది. దోషిగా నిర్థారించబడిన అక్షయ్, ఉరిశిక్షపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 17వ తేదీన ఈ పిల్‌పై వాదనలు జరగనున్నాయి. మిగిలిన ముగ్గురు దోషులు.. పవన్ గుప్తా, ముకేశ్, వినయ్ శర్మ గతంలోనే రివ్యూ పిల్స్ దాఖలు చేయగా వాటిని సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments