Webdunia - Bharat's app for daily news and videos

Install App

Draupadi Murmu: 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము

Webdunia
గురువారం, 21 జులై 2022 (21:23 IST)
అనుకున్నదే జరిగింది. దేశ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. మూడో రౌండ్ పూర్తి అయ్యే సమయానికి పోలైన మొత్తం వ్యాలిడ్ ఓట్లలో 50 శాతానికి పైగా ముర్ము గెలుచుకోవడంతో విజయం సునాయసమైంది.

 
ఇప్పటి వరకు ముర్ముకు 2,161 ఓట్లు రాగా వాటి విలువ 5,77,777. యశ్వంత్ సిన్హాకు 1,058 ఓట్లు రాగా వాటి విలువ 2,61,062. కాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఇప్పటికే శ్రీమతి ముర్ముని అభినందించారు. " మొదటిసారిగా రాష్ట్రపతిగా ఓ గిరిజన మహిళను ఎన్డీఏ తరపున ఎంపిక చేసినందుకు, దేశానికి ఓ గిరిజన మహిళను రాష్ట్రపతిగా అందించినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు. అస్సాంలో సంపూర్ణ ఆనందం ఉంది, ముఖ్యంగా తేయాకు తోటలలో, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు," అన్నారాయన.

 
మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన కేబినెట్‌లోని కొందరు సీనియర్ సభ్యులు, బిజెపి చీఫ్ జెపి నడ్డా ఫలితాలు ప్రకటించిన తర్వాత ఆమెను అభినందించడానికి తీన్‌మూర్తి మార్గ్‌లో తాత్కాలికంగా బస చేస్తున్న ద్రౌపది ముర్ముని సందర్శించి అభినందనలు తెలిపేందుకు వెళ్లనున్నట్లు సమాచారం.

 
ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగిసిన మరుసటి రోజు జూలై 25న రాష్ట్రపతిగా ఎన్నికైన వారు ప్రమాణ స్వీకారం చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవర సెన్సార్ రిపోర్ట్ వచ్చాకే ట్రిమ్ చేశారు? దేవర ప్రివ్యూ రిపోర్ట్

వైవిధ్యం పేరుతో ప్రభాస్ తో ప్రయోగాలు చేస్తున్న దర్శకులు

విడాకుల కోసం కోర్టుకెక్కిన 'రంగేలీ' భామ

సిటాడెల్ హనీ బన్నీ ప్రీమియర్ షోకు హాజరైన సమంత, ప్రియాంక చోప్రా

మోహన్‌బాబు ఇంట్లో రూ.10లక్షలు చోరీ.. వ్యక్తి అరెస్ట్.. తిరుపతిలో పట్టుకున్నారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ప్రతిరోజూ 3-5 కప్పుల కాఫీ తీసుకుంటే.. అంత మేలు జరుగుతుందా?

బత్తాయి రసంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏంటి?

4 సంవత్సరాల బాలుడికి ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

తేనెతో డైరెక్ట్ ప్యాక్ వద్దు.. అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తోనే?

తర్వాతి కథనం
Show comments