Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోసారి మునిగిన ముంబై... ఆరెంజ్ అలెర్ట్

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (15:29 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబై మరోమారు మునిగిపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన ముంబై మహానగరాన్ని మళ్లీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. 
 
ముంబై నగరంలో రానున్న రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసి, ఆరెంజ్‌ అలర్ట్‌ను ప్రకటించింది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలో జనజీవనం స్తంభించింది.
 
రోడ్లపై పలు ప్రాంతాల్లో నీరు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో అన్ని రకాల రైళ్ళు, విమానాల రాకపోకలు స్థంభించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు వరదలతో ఇబ్బంది పడకుండా పలు ప్రభుత్వ విభాగాలు ట్విటర్‌లో చురుకుగా ఉంటున్నాయి. ముంబైను సురక్షితంగా ఉంచేందుకు ఏదైనా సహాయం కావాలంటే 1916కు కాల్‌ చేయాలని అధికారులు సూచనలు జారీ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments